![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vizag Ploice press Meet : డబ్బు కోసమే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ - రియల్ ఎస్టేట్ గొడవలు కాదన్న పోలీసులు !
డబ్బు కోసమే ఎంపీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారని విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
![Vizag Ploice press Meet : డబ్బు కోసమే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ - రియల్ ఎస్టేట్ గొడవలు కాదన్న పోలీసులు ! Visakha Police Commissioner announced that MP's family members were kidnapped for money. Vizag Ploice press Meet : డబ్బు కోసమే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ - రియల్ ఎస్టేట్ గొడవలు కాదన్న పోలీసులు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/15/58146eadbcb6dd237b1b8019dc019f9b1686832577257228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vizag Ploice press Meet : వైఎస్ఆర్సీపీకి చెందిన విసాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ గన్నపనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్ డబ్బు కోసం జరిగిదంటూ వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ ప్రకటించారు. ఇందులో రియల్ ఎస్టేట్ వివాదాలు లేవన్నారు. కిడ్నాప్ పై ఎంపీ నుంచి ఫిర్యాదు వచ్చిన రెండు గంటలలోనే సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా కిడ్నాపర్స్ ను పట్టుకున్నామని ప్రకటించారు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కు స్థిరాస్తి వ్యవహారాలేమీ కారణం కాదన్నారు. డబ్బు కోసమే ఎంపీ భార్య, కుమారుడ్ని, వారి ఆడిటర్ ను కిడ్నాప్ చేశారని స్పష్టం చేశారు.
ఈ నెల 13న ఎంపీ కుమారుడు శరత్ చంద్రను కిడ్నాప్ చేశారని, ఆపై శరత్ తల్లిని కూడా బెదిరించి బంగారం, నగదు తీసుకున్నారని త్రివిక్రమ వర్మ వెల్లడించారు. ఆడిటర్ వద్ద ఎక్కువ డబ్బు ఉంటుందని ఆయనను కూడా ట్రాప్ చేసి పిలిపించారని తెలిపారు. గన్నమనేని వెంకటేశ్వరరావు , శరత్ చంద్ర ఖాతాల నుంచి రూ.కోటిన్నరకి పైగా లావాదేవీ జరిగిందని సీపీ తెలిపారు. కిడ్నాపర్లలో ఒకరు గతంలో ఎంపీకి చెందిన కంపెనీలో సబ్ కాంట్రాక్టరుగా పనిచేశారు. ఎంపీ వద్ద బాగా డబ్బు ఉంటుందని భావించి ఈ కిడ్నాప్ కు ప్రయత్నించారు. డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో హేమంత్ అనే వ్యక్తిపై హత్య, పలు కిడ్నాప్ లు సహా 12 కేసులు ఉన్నాయి. హేమంత్ స్వస్థలం భీమిలి” అని సీపీ తివిక్రమ వర్మ వివరించారు.
ఎంపీ నివాసంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసు బృందాలు అప్రమత్తం అయ్యాయని పోలీస్ కమిషర్ తెిలపారు. పోలీసులు ఆడిటర్ జీవీకి ఫోన్ చేస్తే ఆయన లైన్ లోకి వచ్చారు,నాకేమీ కాలేదు, శ్రీకాకుళం నుంచి వస్తున్నాను అని చెప్పారు. కానీ టెక్నికల్ ఎవిడెన్సులు చూస్తే, ఆడిటర్ జీవీ ఏదో పొంతన లేకుండా మాట్లాడినట్టు అర్థమైంది. సెల్ ఫోన్ సిగ్నల్ రుషికొండ ఏరియాను చూపిస్తోంది. వారు విజయనగరం వైపు పారిపోయే అవకాశం ఉన్నట్టు గుర్తించాం. దాంతో పోలీసులు వారి వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. చివరికి కిడ్నాపర్లు ఉన్న కారు సీఐ వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్లిపోయింది. హేమంత్, రాజేశ్ అనే ఇద్దరు వ్యక్తులు కారు దిగి పరిగెత్తారు. వాళ్లిద్దరినీ పోలీసులు వెంటాడి పట్టుకున్నారని త్రివిక్రమ్ వర్మ ప్రకటించారు.
ఈ ఘటనలో ఏడుగురి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా తేలిందని, ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారితో ఒకరు రౌడీ షీటర్ హేమంత్ కుమార్ గా గుర్తించామన్నారు.ఈ కేసును చ్చేధించడంలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. రౌడీ షీటర్ హేమంత్ ఎవరో తనకు తెలియదని.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)