అన్వేషించండి

YV Subbareddy: మాజీ సీఎం తోడల్లుడిననే కారణంతో కేసులో ఇరికించారు - వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తోడల్లుడిని అయినందుకే తనను కేసులో ఇరికింటారంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. అందుకే కేసును కొట్టివేయాలని కోరారు.

YV Subbareddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తోడల్లుడిని అయినందుకే తనను కేసులో ఇరికించారంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇందూ-హౌసింగ్ బోర్డు ఒప్పందాలకు సంబంధించిన అవకతలవకలపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని ధర్మాసనానికి నివేదించారు. కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడిని అయినందుకే ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చారని.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో వివరించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... పిటిషర్ పై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైందని అయితే ఈ చట్టం కింద మరే అధికారి నిందితుడిగా లేరని అన్నారు. 

ఏ సంబంధమూ లేదు.. 
హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా తన పేరు లేదని వై.వి. సుబ్బా రెడ్డి వివరించారు. గచ్చిబౌలి ప్రాజెక్టులో ఇందూ ప్రాజెక్టుకు ఉన్న 50 శాతం వాటా ఇందూ-హౌసింగ్ బోర్డుకు బదిలీ అయిందని ప్రధాన ఆరోపణ అని ఆయన తెలిపారు. 4.23 ఎకరాల గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టును వసంత ప్రాజెక్టు అప్పట్లో దక్కించుకుందని సుబ్బా రెడ్డి వివరించారు. అయితే ఆ తర్వాత పురపాలక నిబంధనలు మారాయని, ఆక్రమణలు పెరిగిపోయాయని, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గచ్చిబౌలి హౌజింగ్ ప్రాజెక్టు ముందుకు సాగలేదని టీటీడీ ఛైర్మన్ సుబ్బా రెడ్డి వెల్లడించారు. గడువు దగ్గర పడుతున్న సమయంలో ఇందూ కంపెనీ గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టు నుండి బయటకు రావాలని నిర్ణయించుకుందని వివరించారు. 

ఆ వాదనల్లో వాస్తవం లేదు 
ఇందులో భాగంగా వసంత ప్రాజెక్ట్స్ లోని 50 శాతం వాటాలను సుబ్బా రెడ్డికి విక్రయించిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిఫలంగానే ఇందూ కంపెనీకి కూకట్ పల్లిలో అదనంగా 15 ఎకరాలు కేటాయించడానికి పిటిషనర్ ఒత్తిడి తెచ్చారన్న వాదనలో వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో 70 ఎకరాల భూమిని ఏపీహెచ్ బీ ఇచ్చిందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. విల్లాలు, ఎంఐజీ, ఎల్ఐజీ రేంజ్ హౌస్ లతో సహా అనేక రకాల గృహాలను నిర్మించడానికి ఈ భూములకు అప్పట్లో అనుమతి ఇచ్చారు. ఇందూ ప్రాజెక్ట్స్ ప్రమోటర్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇందూ ప్రాజెక్టులకు అర్హతలు లేకపోయినా.. హౌసింగ్ ప్రాజెక్టులను పొందేందుకు కృష్ణ ప్రసాద్ వసంత ప్రాజెక్టులను స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఉపయోగించారు. 

సెప్టెంబరు 8కి వాయిదా 
గచ్చిబౌలిలో నిర్మించిన విల్లాలపై కృష్ణ ప్రసాద్, సుబ్బా రెడ్డి తమ కుటుంబాలకు తక్కువ ధరకే ఇచ్చారని సీబీఐ న్యాయవాది కోర్టు ముందు వాదించారు. సీబీఐ ప్రకారం, ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని స్వీకరించడానికి బదులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాపారానికి శ్యామ్ ప్రసాద్ 70 కోట్ల రూపాయలను అందించారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను సెప్టెంబరు 8కి వాయిదా వేసింది. తదుపరి వాదనలు అప్పుడు జరుగుతాయని వెల్లడించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget