News
News
వీడియోలు ఆటలు
X

Chandrababu: చంద్రబాబు పర్యటనలో కనిపించని ఎంపీ కేశినేని నాని, ఏపీ టీడీపీలో హాట్ టాపిక్

తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని చంద్రబాబు టూర్ లో కనిపించలేదు. దీంతో ఆయన వ్యవహర శైలి మరో సారి పార్టీ నేతల్లో చర్చనీయాశంగా మారింది.

FOLLOW US: 
Share:

బెజవాడ తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని చంద్రబాబు టూర్ లో కనిపించలేదు. దీంతో ఆయన వ్యవహర శైలి మరో సారి పార్టీ నేతల్లో చర్చనీయాశంగా మారింది.
చంద్రబాబు టూర్ లో ఎంపీ ఎక్కడ...
చంద్రబాబు పర్యటనలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కనిపించకుండా పోయారు. చంద్రబాబు విజయవాడ పర్యటలో ఉండగా ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండి వేరొక కార్యక్రమానికి హజరు కావటం విశేషం. దీంతో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నేత చంద్రబాబు వెనుక లేకపోవటంపై పార్టీ నేతల్లో చర్చ మెదలైంది. ఉమ్మడి KRISHNA జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. మూడు నియోజవకర్గాల పరిధిలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటన జరుగుతుంది. చంద్రబాబు తొలి రోజు పర్యటనలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో టూర్ స్టార్ట్ అయ్యింది. వాస్తవానికి పార్లమెంట్ సభ్యుడి హోదాలో కేశినేని నాని చంద్రబాబుకు స్వాగతం పలకాల్సి ఉంది. అయినా ఆయన మాత్రం కనిపించలేదు. స్థానిక శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ మాత్రమే, చంద్రబాబుకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో పలువురు నేతలు తెలుగు దేశం పార్టిలో చేరటంతో వారికి చంద్రబాబు కండువా కప్పి పార్టిలోకి ఆహ్వనించారు.
సైకో పాలన పోవాలంటూ చంద్రబాబు ఫైర్...
విజయవాడలో పర్యటించిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ను సైకో అంటూ మండిపడ్డారు. ఇంటింటికీ సీఎం జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారని, మన ఇళ్ల మీద సైకో బొమ్మలేంటని చంద్రబాబు ప్రశ్నించారు. వేరే వారి ఇళ్ల గోడల పై రాయాలన్నా, ఎలాంటి కరపత్రాలు, బొమ్మలు అతికించాలన్నా ఇంటి యజమానుల అనుమతి తప్పనిసరగా ఉండాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరి అనుమతి తీసుకొని వాలంటీర్లు జగన్ స్టిక్కర్లు ప్రజల ఇళ్ల గోడలపై అతికిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజలసొమ్ము జీతంగా తీసు కుంటున్న వాలంటీర్లు సైకో ముఖ్యమంత్రి కోసం ఎలాపనిచేస్తారా అని నిలదీశారు.

జగన్ సమాజానికి పట్టిన క్యాన్సర్ అని, జగన్ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్యాన్సర్ మాదిరిగానే, జగన్ కూడా సమాజాన్ని, మరీ ముఖ్యంగా ఆడబిడ్డ ల్ని పట్టిపీడిస్తున్నాడని ఫైర్ అయ్యారు. నిత్యావసర ధరలు .. గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందో లేదో ఆడబిడ్డలు చెప్పాన్నారు. నూనె ధర బాగా పెరిగాయని, సలసలకాగే నూనెలో జగన్ ను వేస్తే, అప్పుడే అతనికిబుద్ధి వస్తుందని చంద్రబాబు అన్నారు. మద్యం ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతపెరిగాయో అందరికి తెలిసిందేనని అన్నారు. 
విద్యుత్ చార్జీలపై చంద్రబాబు ఆగ్రహం...
విద్యుత్ ఛార్జీలు ఈనెల నుంచి రూ.5,500 కోట్లు పెంచుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. యూనిట్ కు 50పైసలు పెంచుతున్నారని, ఇదే కదా బాదుడేబాదుడు అంటే అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ ఇచ్చేది పదిరూపాయలు... గుంజేది వంద రూపాయలన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. అబద్ధాలతో, మోసాలతో ప్రజల్ని నమ్మిస్తున్న జగన్ ప్రజల నమ్మకం.. భవిష్యత్  కానే కాదని చంద్రబాబు అన్నారు. జగనే రాష్ట్రానికి పట్టిన దరిద్రం, జగన్ ఉంటే రాష్ట్రం అంధకారమేన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మనల్నిచూసి భయపడిన వారు, ఇప్పుడు మనల్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని, వారందరికి రాబోయే రోజుల్లో గట్టిగా సమధానం ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

Published at : 12 Apr 2023 10:15 PM (IST) Tags: AP Latest news tdp chief news Chandra Babu News mp kesineni nani Telugu desam Party News

సంబంధిత కథనాలు

Pawan Kalyan Varahi: ఈనెల నుంచే రోడ్లపైకి వారాహి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan Varahi: ఈనెల నుంచే రోడ్లపైకి వారాహి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్!

గుంటూరులో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్

గుంటూరులో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP Employees: ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల భేటీ, అసహనంతోనే బయటికి!

AP Employees: ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల భేటీ, అసహనంతోనే బయటికి!

టాప్ స్టోరీస్

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

GVL : పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకేనా ? - ఆ మేరకే కేంద్రం నిధులిస్తుందన్న జీవీఎల్ !

GVL :   పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకేనా ? - ఆ మేరకే కేంద్రం నిధులిస్తుందన్న జీవీఎల్ !