అన్వేషించండి

Kesineni Nani Resigns: టీడీపీకి, విజయవాడ ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా

Kesineni Nani Resignation Letter: కేశినేని నాని విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించారు.

Vijayawada MP Kesineni Nani Resigns: అమరావతి: కేశినేని నాని విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించారు. కాగా, బుధవారం మధ్యాహ్నం కేశినేని నాని (Kesineni Nani ) తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan)తో భేటీ అయ్యారు. జగన్ తో భేటీ అనంతరం ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని మీడియాకు వెల్లడించారు. తన రాజీనామా  ఆమోదం పొందిన తరువాత అధికార పార్టీ వైఎస్సార్ సీపీలో చేరతానని కేశినేని నాని తెలిపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం కేశినేని రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు కి రాజీనామా లేఖను పంపారు.


Kesineni Nani Resigns: టీడీపీకి, విజయవాడ ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా

వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నానన్న కేశినేని నాని 
సొంత వ్యాపారాల కంటే టీడీపీ కోసమే ఎక్కువగా పని చేశానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎంతో మంది చెప్పినా పట్టించుకోకుండా, పార్టీలోనే కొనసాగానని కేశినేని నాని తెలిపారు. ఇన్ని రోజులు టీడీపీ కోసం ఎంతో చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు అని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ, జెడ్పీటీసీ, ఎంపిటీసీ,  కార్పోరేషన్, జనరల్ ఎలక్షన్ ల ఖర్చులు తానే భరించినా, అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కేశినేని నాని బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు.

అవమానాలు భరించలేకనే కీలక నిర్ణయం.. 
ఏపీ సీఎం జగన్ తో భేటీ ముగిసన అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. టీడీపీకి తన రాజీనామా పొందిన తరువాత వైసీపీలో చేరతానని స్పష్టం చేశారు.  టీడీపీలో ఇంక అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నేతల నుంచి ఎన్ని అవమనాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డానని, చంద్రబాబు పచ్చి మోసగాడు అని ప్రపంచానికి తెలుసు, కానీ ఈ స్థాయిలో మోసం చేస్తాడని ఊహించలేదన్నారు. రాబిన్ శర్మ టీమ్ మన పార్టీకి ఎన్నికల్లో 5 కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారని.. కానీ ఆ రిపోర్ట్ బయటకు రావొద్దని తనకు సూచించినట్లు కేశినేని నాని వెల్లడించారు. ఓ వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించి తనను ఉద్దేశపూర్వకంగానే తిట్టించారంటూ మండిపడ్డారు. చెప్పుతో నన్ను కొడతారని ఆ వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సైతం పార్టీ నుంచి కనీసం స్పందన లేదన్నారు.

ఎన్నికల భారాన్ని భుజాలపై మోశానన్న కేశినేని.. 
చంద్రబాబు, లోకేష్ పాదయాత్రతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల భారాన్ని తన భుజాలపై మోశానని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లలో పార్టీ పట్ల ఏరోజూ వ్యతిరేకంగా పనిచేయలేదని, చంద్రబాబు జైళ్లో ఉన్న సమయంలో వారి కుటుంబానికి అండగా ఉండానని గుర్తుచేశారు. విజయవాడ డెవలప్ మెంట్ కోసం తాను ఎలాంటి పనికైనా సిద్ధమన్నారు. 2014 నుంచి 2019 వరకు విజయవాడకు అప్పటి సీఎం చంద్రబాబు వంద కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget