అన్వేషించండి

తాడేపల్లి చేరిన మైలవరం పంచాయితీ- కాసేపట్లో జగన్‌తో నియోజకవర్గ నేతల భేటీ

ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీ నేతలను ఆ దిశగా సన్నద్ధం చేస్తూనే విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే పలు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.

మైలవరం వైసీపీ పంచాయితీ జగన్‌ వద్దకు చేరింది. ఇవాళ దీనిపై సీఎం ఆ నియోజకవర్గ లీడర్లతో సమావేశం కానున్నారు. ఇక్కడ మంత్రి జోగి రమేష్‌, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. దీనిపై ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.

ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీ నేతలను ఆ దిశగా సన్నద్ధం చేస్తూనే విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే పలు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు మైలవరం వంతు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ నియోజకవర్గం తరచూ వార్తల్లో ఉండటంతో దానిపై ఫోకస్ పెట్టారు జగన్.

ఎవరికి ఎలా...ఉంటుంది...
మైలవరం ఎవరికి వరంగా మారబోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్ళీ సిటు దక్కుతుందా... ఎమ్మెల్యే వసంత కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా... తనయుడి కోసం  మంత్రి జోగి రమేష్  చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా.... మైలవరం పంచాయతీ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమి తేల్చబోతున్నారు అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.

మైలవరం నియోజకవర్గంపై మంత్రి జోగి రమేష్ కన్నేశారు. స్థానిక అంశాలపై జోక్యం చేసుకుంటున్నారు. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతం అసహనం వ్యక్తం చేశారు. ఇదే కొన్ని రోజుల నుంచి వైసీపీలో తలనొప్పిగా మారింది. 

ఇప్పటికే పార్టీ పెద్దల పంచాయితీ...
మైలవరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో సీఎం సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపి గెలిపించే బాధ్యత కార్యకర్తల భుజాన పెడుతున్నారు సీఎం. నియోజకవర్గ అభ్యర్థులను అదే సమావేశంలో ఖరారు చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో నియోజకవర్గ సమావేశంపై ఆసక్తి ఏర్పడింది. 

స్థానిక ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో పట్టు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ వివాదం కాస్త ముదరడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ పార్టీ పెద్దలను కలిసి మంత్రి జోగి రమేష్‌పై ఫిర్యాదు చేశారు. మంత్రి జోగి రమేష్ కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జలతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితులు, వసంత ఫిర్యాదులపై వివరణ ఇచ్చారు. 

ఇద్దరు కలిసి పని చేయాలని పార్టీ ముఖ్య నేతలు చెప్పినట్టికీ ఇంకా నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ మంత్రిగా ఉన్న జోగి మైలవరం నియోజకవర్గంలో ఉన్న తన వర్గాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరాలు నడిపిస్తున్నారని వసంత వర్గం చాలా సీరియస్ గా ఉంది.

జగన్‌తో సమావేశం తరువాత అయినా కొలిక్కి వస్తుందా? 

నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో సీఎం జగన్ మైలవరం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రి జోగి రమేష్ ఆయనకు లేదంటే ఆయన తనయుడికి మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ మళ్ళీ మైలవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశంలో సీఎం జగన్, వసంత అభ్యర్థిత్వంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. గతంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ అభ్యర్థులను జగన్ ప్రకటించారు. ఇప్పుడు వసంత విషయంలోను అదే వైఖరితో ఉన్నారా అనేది ఆసక్తిగా మారింది. ఒక వేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది అధికార పార్టీలో ఆసక్తిగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget