అన్వేషించండి

కన్నార్పకుండా అబద్దాలు చెప్పగలిగే వ్యక్తి- సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.364 కోట్లు ఖర్చు చేసి 5 వేల మందిని విదేశీ విద్యకు పంపామని, ఇప్పుడు జాబ్ క్యాలండర్ లేదన్నారు చంద్రబాబు. ఉద్యోగాలు లేవన్నారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాల్సి అవసరం ఉందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సివి నాయుడు పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడుకు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 6 నియోజకవర్గాల్లో ఉన్న తన అనుచరులతో కలసి ఎస్‌సివి నాయుడు పార్టీలో చేరారు.

రాష్ట్రం గెలవాలన్న చంద్రబాబు..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాల్సి అవసరం ఏర్పడిందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతేనే రాష్ట్రం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. వ్యక్తులు, పార్టీలు శాశ్వతం కాదని, రాష్ట్రం శాశ్వతం అనే విషయాన్ని గుర్తించి ప్రజలను అలర్ట్ చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు చంద్రబాబు.  జగన్ లాంటి సైకో పోవాలన్నారు.  కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పగలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.  తాను హైదరాబాద్ అభివృద్ది చేసింది తెలుగు జాతి కోసమని,  అయితే ఇప్పుడు ఏపీలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకే కాదు,  వైసీపీ నేతలకు కూడా కంటి మీద కునుకులేదని అభిప్రాయపడ్డారు.

విద్యా రంగం దైన్యంగా మారింది..
జగన్ ఎంత పక్కాగా అబద్దాలు చెపుతారో విద్యారంగాన్ని చూస్తే తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని, రాష్ట్రం నుంచి 90 వేల మంది ఎంసెట్ రాయడానికి తెలంగాణ వెళ్లారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాసంస్థలు తెచ్చింది తెలుగుదేశమేనని అన్నారు. మళ్లీ అటువంటి సంస్థలు ఏపీలో ఉండాలని 2014తరువాత ఐఐటి, ఐఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్‌ఐటి, ట్రైబల్ యూనివర్సిటీ తెచ్చామని చెప్పారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతం కావాలి అని ఎస్‌ఆర్ఎం, విట్, ఎక్స్ ఎల్ ఆర్ ఐ వంటి సంస్థలు తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ విట్ కాలేజ్‌కు వెళ్లడానికి కనీసం దారి కూడా వెయ్యలేదన్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.364 కోట్లు ఖర్చు చేసి 5 వేల మందిని విదేశీ విద్యకు పంపామని, ఇప్పుడు జాబ్ క్యాలండర్ లేదన్నారు చంద్రబాబు. ఉద్యోగాలు లేవన్నారు. ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు, ట్రస్ట్ కాలేజ్‌లు అన్నీ నాశనం చేశారని మండిపడ్డారు. తెలుగులో చదివిన సత్య నాదెళ్ల, తమిళంలో చదివిన సుందర్ పిచాయ్ ఉన్నత స్థానానికి వెళ్లారని గుర్తు చేశారు. 

భూములను సైతం వదలటం లేదు...
విశాఖలో లలితేష్ అనే వ్యక్తి విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకుని రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు వైజాగ్‌లో భూమి కొనుక్కున్నారని, జగన్ సిఎం అయిన తరువాత ఆ భూమి లాక్కోవాలని చూశారని ఆరోపించారు. అతను అడ్డుపడితే దానిపై లిటిగేషన్‌లు పెట్టారని, కోర్టుకు వెళ్లి తన సొంత భూమిని కాపాడుకోవడానికి కష్ట పడ్డాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అంతేకాదు కుదరవల్లి శ్రీనివాసరావు ట్రస్ట్ భూములు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారని, ఈ దుర్మార్గులు ఆ భూమి కోసం శ్రీనివాసరావు పిల్లలను కిడ్నాప్ చేశారని అన్నారు. తెలంగాణ పోలీసుల ద్వారా వారు భయటపడ్డారని అన్నారు. చివరకు ఆయన అమెరికా వెళ్లిపోయారని, అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారని , ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget