అన్వేషించండి

విజయవాడలో టీడీపీ కార్పొరేటర్లకు ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌లు- ఇదో రకమైన నిరసన

బెజవాడ కార్పోరేషన్‌లో మధ్యాహ్న భోజనంపై రగడతో టీడీపీ లీడర్లు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకున్నారు.

బెజవాడ కార్పోరేషన్‌లో తెలుగు దేశం నేతలు లంచ్ బాక్స్‌లతో వినూత్నంగా నిరసన తెలిపారు. కౌన్సిల్ సమావేశాలకు, ప్రతిపక్ష సభ్యులు తింటానికి మాత్రమే వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేయటంపై తెలుగుదేశం కార్పోరేటర్లు అభ్యంతరం తెలిపారు. విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశానికి సీపీఎం, తెలుగు దేశం పార్టీకి చెందిన కార్పోరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. అధికార పక్షం అభివృద్ధి, సంక్షేమంపై చర్చ అంటూనే ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని తెలుగు దేశం, సీపీఎం కార్పోరేటర్లు వ్యాఖ్యానించారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే, దాడులు చేస్తూ, అక్రమంగా కేసులు పెడుతున్నారని నేతలు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరిన తమను అవమానించేలా భోజనం చేయటానికే ప్రతిపక్ష సభ్యులు వస్తున్నారంటూ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్లేట్ భోజనం 700 రూపాయలు..

విజయవాడ నగర పాలక సంస్థ నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో మధ్యాహ్నం సమయంలో భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజనానికి 700రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఒక్కో ప్లేట్ భోజనం 700 పెట్టి వడ్డిస్తుంటే ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చించకుండా అడ్డుకుంటున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. దీనికి నిరసనగా తెలుగు దేశం పార్టీకి చెందిన కార్పోరేటర్లు ఇంటి నుంచి వస్తూనే తమతోపాటుగా క్యారియర్లు కూడా తీసుకువచ్చారు.

గరం గరంగా కౌన్సిల్ సమావేశం...

బెజవాడ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది. ఇంటి పన్నుల పెంపుదల,ఖాళీ స్థలాలకు పన్నుల మోతపై కార్పోరేషన్‌లో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. అయితే ప్రతిపక్షాల నిరసనలను పట్టించుకోని అధికార పక్షం కౌన్సిల్ అజెండాలోని అంశాలపై చర్చించేందుకు ప్రయత్నించింది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు కూడా ఎదురు దాడి చేశారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైసీపీ నేతల కౌంటర్....

తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గాన్ని ఎడారిగా మార్చారని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి దొంగల పార్టీ అని ఆ పార్టీ నేతలు పలువురు చోరీ కేసుల్లో అరెస్టయ్యారని అయన పేర్కొన్నారు. పగలు వీధుల్లో తిరుగుతూ రిక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో దొంగతనాలను, చోరీలను చేసేలా టిడిపి కార్యకర్తలను గద్దె ప్రోత్సహిస్తున్నారని అయన ఆరోపించారు. 18వ డివిజన్ టిడిపి అభ్యర్థిగ పోటీ చేసిన పీరుబాబుతోపాటు పలువురు టీడిపి నేతలు చోరీ కేసులో అరెస్ట్ అయ్యారని వివరించారు. నియోజకవర్గంలోనీ ఆన్ని డివిజన్లలో టిడిపి, వైసిపి నేతలపై ఉన్న కేసుల గురించి చర్చించేందుకు తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. రాణిగారి తోటలో జరిగిన చంద్రబాబు కార్యక్రమంలో ఆయన సమక్షంలో టీడిపి తీర్థం పుచ్చుకున్న వారందరూ దొంగలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులేనని ఆధారాలతో నిరూపితం అయిందన్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన నాయకులపై కేసులు ఉంటే వారిని ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. టీడీపీ నేతలు లంచ్ బ్యాగ్ లతో కౌన్సిల్ లోకి రావటాన్ని వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget