అన్వేషించండి

Chandrababu: ఆగస్టు 15 నుంచి వంద అన్నా క్యాంటీన్లు, గుడివాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

Anna canteens: అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం పునః ప్రారంభిస్తోంది. ఆగస్టు 15 న గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు.

AP CM Chandrababu Will Start One Hundred Anna Canteens : సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించడం ద్వారా ఈ పథకం పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్‌ ఖరారైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత విశాఖ జిల్లాలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్‌ ఉండడంతో కార్యక్రమం వాయిదా పడింది. దీంతో కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించడం ద్వారా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

తొలి దశలో అందుబాటులోకి తీసుకువస్తున్న అన్నా క్యాంటీన్లు జిల్లాల్లో ఎంపిక చేసిన 33 పురపాలక, నగర పాలక సంస్థల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నప్పటికీ 16వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. 

అక్షయ పాత్రకు అన్న క్యాంటీన్ల ఆహార పంపిణీ కాంట్రాక్ట్‌

రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న అన్నా క్యాంటీన్లు ద్వారా ఆహారం అందించే కాంట్రాక్ట్‌ను అక్షయ పాత్ర దక్కించుకుంది. ఈ మేరకు మంత్రి నారాయణ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ ఏర్పాట్లను పరిశీలించినట్టు వెల్లడించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్లు అప్పటి తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో 180 చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ క్యాంటీన్లు ద్వారా నాణ్యమైన భోజనాన్ని రూ.5కే అందించామని, మొత్తంగా 4.60 కోట్ల మందికి శుభ్రతతో కూడిన రుచికరమైన భోజనాలు అందించినట్టు మంత్రి వివరించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని పూర్తిగా తొలగించేసిందన్న మంత్రి.. తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వీటిని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్లడిచంఆరు. పట్టణ ప్రాంతాల్లో 180 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. గ్రామీణ ప్రాంతాల్లో 200కుపైగా క్యాంటీన్లను ప్రారంభించాలన్న ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. పేద వర్గాలు అధికంగా ఉండే ప్రాంతాలైన మార్కెట్లు, ఆస్పత్రులు వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ప్రతి నిరుపేద ఆకలిని తీర్చేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget