అన్వేషించండి

Tirumala Laddu News: జగన్ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి గుర్తించాం - లడ్డూ వివాదంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Tirumala Laddu Controversy | వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్న సమయంలో తిరుమలలో పలుమార్లు కల్తీ నెయ్యి గుర్తించి, ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించామని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన విషయాలు వెల్లడించారు.

AP EX minister Kodali Nani sensational comments on Tirumala Laddu Controversy | తాడేపల్లి: తిరుమలలో లడ్డూ పవిత్రతను దెబ్బతీసింది సీఎం చంద్రబాబు అని, రాజకీయ లబ్ది కోసం కల్తీ నెయ్యి పేరుతో చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన తరహాలోనే టెండర్లకు పిలిచి వైసీపీ పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. తాడేపల్లిలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 18 సార్లు నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపినట్లు తెలిపారు. ప్రతి వాహనాన్ని చెక్ చేసి, లోపాలు ఉంటే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించామన్నారు. జగన్ సీఎంగా ఉన్నా, చంద్రబాబు సీఎంగా ఉన్నా క్వాలిటీ లేకుంటే వెనక్కి పంపాల్సి ఉంటుందన్నారు. 

జులై 17 వరకు ఆహార తినుబండారాలు కాంట్రాక్టర్లు నెయ్యిని సప్లై చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే క్వాలిటీ లేదని నెయ్యిని వెనక్కి పంపించారు. ఆ నెయ్యిని ఎక్కడా వాడలేదు. ఇలాంటివి ఎప్పుడూ వాడరని కొడాలి నాని తెలిపారు. కానీ చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం జంతువుల కొవ్వు కలిసింది, వాటితో లడ్డూ ప్రసాదాలు తయారుచేసి భక్తులకు ఇచ్చారని దుష్ప్రచారం చేశారని విమర్శించారు.

చంద్రబాబు ఎన్నిసార్లు తలనీలాలు అర్పించారు.. 
కొడాలి నాని ఇంకా మాట్లాడుతూ.. ‘ఏ ప్రభుత్వం అయినా సరే తిరుమలకు వచ్చే నెయ్యిలో కల్తీవి వస్తుంటాయి. అయితే పరీక్షించిన తరువాత కల్తీ నెయ్యిని వెనక్కి తిప్పి పంపడం సర్వసహజం.  దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ట, వైభవం కలిగిన తిరుమల ఆలయంలో అన్నం తినేవాడు ఎవడైనా ఇలా దుష్ప్రచారం చేస్తారా. నా వయసు 50 ఏళ్లు. 40 సార్లు తిరుమలకు వెళ్లా. 20 సార్లు గుండు కొట్టించుకున్న. 15 సార్లు కింద నుంచి కొండ మీదకు నడిచి వెళ్లాను. చంద్రబాబు తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుడా. రాజకీయాలకు స్వామి వారిని, భక్తులను వాడుకుంటున్నారు. అయితే చంద్రబాబు ఇప్పటివరకు తిరుమలకు వెళ్లి ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించారు. మహిళలు కూడా తిరుమలకు వెళ్లి స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు.

సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం

తిరుమల వివాదంపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని సైతం కోరాం. కానీ చంద్రబాబు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై సిట్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు కూర్చోమంటున్నారు. నిల్చోమంటో నిల్చుంటారు సిట్ అంటే అదేనా. లోకేష్, చంద్రబాబు వద్దకు వెళ్లి వాళ్లు ఏం చెబితే అది రిపోర్టు చేస్తారు. చంద్రబాబు మక్కెలిరకగొడతా అంటున్నాడు. కాకినాడ ఎమ్మెల్యే ఓ ప్రొఫెసర్ ను కొట్టాడు. ఆయన మక్కెలిరగకొట్టావా. చంద్రబాబు చేసిన పాపానికి శిక్ష వేయాల్సి వస్తే దేవుడు ఆయనకు శిక్ష వేయాలి. అంతేగానీ భక్తుల్ని కాపాడాలని స్వామివారిని కోరుతున్నాను. చంద్రబాబు ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలి. లేకపోతే దేవుడు పెద్ద శిక్ష వేస్తాడు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని.. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ చేయాలని’ సూచించారు.

Also Read: YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget