అన్వేషించండి

Andhra Pradesh CM Chandra Babu: ఏ ఒక్క దివ్యాంగునికీ అన్యాయం జరగదు, నకిలీ పింఛన్‌లే తొలగిస్తాం :చంద్రబాబు

Andhra Pradesh CM Chandra Babu: ఏ ఒక్క దివ్యాంగునికీ అన్యాయం జరగదు. నకిలీ పెన్షన్ లు మాత్రమే తొలగిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు

Andhra Pradesh CM Chandra Babu: "అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ లు తొలగించం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు " అన్నారు సీయం చంద్రబాబు. తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన అన్నారు. “దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనంత స్థాయిలో పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నాం. సామాజిక భద్రత, వృద్ధాప్య పెన్షన్లును రూ 30 నుంచి రూ. 4000 వరకు మనమే తెచ్చాం. ప్రస్తుతం వృద్ధులకు ఇస్తున్న రూ. 4000 పెన్షన్ మొత్తంలో టీడీపీ ప్రభుత్వాలు రూ. 2875 పెంచాయి. దివ్యాంగులకు గత ప్రభుత్వం రూపాయి కూడా పింఛను పెంచలేదు. వైసీపీ ప్రభుత్వానికి నోరెత్తి మాట్లాడే అర్హత లేదు. దివ్యాంగుల పెన్షన్లను రూ. 500 నుంచి రూ. 6000 చేసింది టీడీపీ ప్రభుత్వాలే. అలాగే డయాలసిస్ రోగులకు రూ. 10 వేలకు పెంచింది టీడీపీనే.. ఇస్తోంది టీడీపీనే. మంచానికే పరిమితమైన వారికి పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టిన టీడీపీ ప్రభుత్వమే.. దాన్ని రూ. 15 వేల వరకు పెంచింది. 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 1వ తేదీనే ఇస్తున్నాం. ఏడాదికి సుమారు రూ.35 వేల కోట్లు పింఛన్లకే ఖర్చు చేస్తున్నాం.” అని చంద్రబాబు చెప్పారు.

నకిలీ పెన్షన్ లు అందుకే తీసేస్తున్నాం: చంద్రబాబు

“అబద్దాల పునాదుల మీదే వైసీపీ రాజకీయం చేస్తుంది. ఆ పార్టీనే తప్పులు చేస్తుంది... వాటిని ఎదుటివారిపై నెడుతుంది. దీన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనైనా.. గతంలోని ఏ ప్రభుత్వాలైనా ఈ స్థాయిలో పెన్షన్లు ఇచ్చాయా..? ఇవ్వడానికి ఆ ప్రభుత్వాలకు మనస్సు వచ్చిందా..? గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చింది. దీని వల్ల అర్హులకు నష్టం కలుగుతోంది. ఏ ఒక్క అర్హుడికి నష్టం కలగకూడదంటే అనర్హులను తప్పించాలి. అనర్హులను గుర్తించే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలున్నా.. అధికార యంత్రాంగం పొరపాట్లు చేసినా.. దాన్ని గుర్తించి.. సరిదిద్దే బాధ్యతను పార్టీ యంత్రాంగం తీసుకోవాలి. సీఎంగా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తాను.. ఏమైనా తేడాలుంటే... పార్టీ అధినేతగా పార్టీ యంత్రాంగం ఇచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను. ఆ లోపాలను సరిదిద్దుతాను. అర్హుడైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. పింఛన్ అందిస్తాం. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్న వారికి నోటీసులతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని ఆదేశించాం. ప్రతి ఇంటికీ మనం చేసే మంచి పని చేరాలి. ప్రభుత్వం మంచి చేస్తోంది... ఇబ్బందులున్నా సంక్షేమం అందిస్తుందనే విషయం ప్రజలు అర్థం చేసుకునేలా వివరించాలి.” అని సీఎం సూచించారు. 

ప్రజల కోసం రాజకీయం చేయాలి... శాశ్వతంగా నిలవాలి*:సీఎం

“కార్యకర్తలు, నేతలు గట్టిగా పని చేసి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించారు. ఏ ఎన్నిక వచ్చినా కూటమే గెలవాలి. మనం ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించి దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తున్నారు. వారి కుట్రల పట్ల  జాగ్రత్తగా ఉండాలి. కొందరు తాత్కాలిక రాజకీయాలు చేయాలనుకుంటారు.. దీని వల్ల ఇబ్బందులు వస్తాయి. శాశ్వత రాజకీయాలు చేయాలి.. అప్పుడు మనం రాణించగలం. జిల్లా కమిటీల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తైంది. త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తాం.  పని చేసే నాయకత్వానికి పెద్దపీట వేస్తాం. కార్యకర్తల్లో మరిన్ని నాయకత్వ లక్షణాలు పెంచుతాం. ఆర్థికంగా బలోపేతం చేస్తాం.” అని చంద్రబాబు వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget