అన్వేషించండి

AP Budget Sessions: హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో - టీడీపీ సభ్యులపై ఒక రోజు వేటు

Andhra Pradesh Assembly Sessions 2024: రెండో రోజు సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సభాపతి పలు మార్పు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోలేదు.

TDP MLAs has been Suspended by Speaker From Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ గట్టిగా డిమాండ్ చేసింది. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గించారు. అందుకే వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు స్పీకర్. 

రెండో రోజు సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సభాపతి పలు మార్పు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్య వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానపై చర్చను ప్రారంభించాలని ఆదేశించారు. 

వాయిదా తీర్మానాలు తిరస్కరించడాన్ని టీడీపీ సభ్యులు తప్పుపట్టారు. నిత్యవసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అందుకే ధరల అంశాన్ని ప్రాధాన్య క్రమంలో తీసుకోవాలని పట్టుపట్టారు. ఈ డిమాండ్‌తోనే అసెంబ్లీ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అక్కడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజిల్స్ వేశారు. 

సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తించిన తీరును వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. రెడ్‌లైన్ దాటిన వారిపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. అనుచిత ప్రవర్తన సరికాదని హెచ్చరించారు. వారి ప్రవర్తన ప్రజలు చూస్తున్నారని వారిని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపిస్తారని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు... ప్రజాసమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అందుకే జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుపై చర్చించినా ఓర్వలేకపోతున్నారని అన్నారు. సంప్రదాయాలు పాటించడంలేదని... స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లడమే తప్పనుకుంటే.. ఆయనపై పేపర్లు చించి వేయడం ఏంటని ప్రశ్నించారు. 

మధ్యలో అంబటి రాంబాబు కూడా లేచి టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రెచ్చగొట్టొద్దని సూచించార. స్వచ్ఛందంగా వాకౌట్ చేసి వెళ్లిపోవడమా... స్పీకర్‌తో వేటు వేయించుకొని వెళ్లడమా.. మార్షల్స్‌తో నెట్టించుకోవడమా అనే ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. వాళ్లుకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవాలని సూచించారు. మొదటి రోజు నుంచి ఇదే తీరున టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు.

ప్రస్తుతం ఈ విడతలో ఆఖరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. రేపు ఉదయం సభ ముందుకు బడ్జెట్ తీసుకురానున్నారు ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి. ఈ సమావేశాల్లో మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రసంగించారు. ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్ర పథాన నిలిపేందుకు నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు. 

మొదటి రోజు కూడా టీడీపీ సభ్యులు సభను వాకౌట్ చేశారు. గవర్నర్‌తో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని ఆరోపిస్తూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ప్రజలకు మేలు చేయాల్సిన సర్కారు ఇలా కీడు చేస్తూ సభలో కీర్తించుకుంటోందని మండిపడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chevella Accident Tragedy: దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
Rangareddy Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
Indian Women Cricket team gesture: ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
Internet Privacy : సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్
సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్
Advertisement

వీడియోలు

India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Who is Head Coach Amol Muzumdar | ఎవరీ అమోల్ మజుందార్..?
Rohit Sharma Emotional | Women ODI World Cup 2025 | ఎమోషనల్ అయిన రోహిత్
India ODI World Cup Winning Captain | ఇండియాను ప్రపంచ విజేతలుగా నిలిపిన కెప్టెన్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chevella Accident Tragedy: దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
Rangareddy Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
Indian Women Cricket team gesture: ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
Internet Privacy : సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్
సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్
Bigg Boss Telugu Season 9 winner : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 విజేత తనూజ! విన్నర్‌ను డిసైడ్ చేసి గేమ్ ఆడిస్తున్న బీబీ టీం!
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 విజేత తనూజ! విన్నర్‌ను డిసైడ్ చేసి గేమ్ ఆడిస్తున్న బీబీ టీం!
New Tata Altroz కొనాలా, వద్దా? - కొత్త ఫేస్‌లిఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌పై ప్లస్‌లు, మైనస్‌లతో పూర్తి విశ్లేషణ
Tata Altroz కొనాలా, వద్దా? - 4 ప్లస్‌లు, 3 మైనస్‌లు
Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Andhra Pradesh Loans: రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
Embed widget