By: ABP Desam | Updated at : 23 Jun 2022 08:32 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
దుర్గమ్మకు బంగారు బోనం
Vijayawada News : బెజవాడ దుర్గమ్మకు హైదరాబాద్ లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం ఆనవాయితీగా సమర్పిస్తుంది. ఈ ఏడాది బంగారు బోనాన్ని జులై 3న ఇంద్రకీలాద్రిపై కొలువై కనకదుర్గమ్మకు అందించాలని నిర్ణయించారు. ఈ కమిటీ సభ్యులు బుధవారం విజయవాడలో దుర్గగుడి ఈవో భ్రమరాంబతో సమావేశమై ఈ విషయాన్ని చర్చించారు. బంగారు బోనం అందించే కార్యక్రమ వివరాలను దుర్గ గుడి ఆలయ ఈవో, ఇంజినీరింగ్ అధికారులకు వివరించారు. ఈ ఏడాది బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు కమిటీ ప్రతినిధులు ఈవోకు తెలిపారు.
శాకంబరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు జులై 11 నుంచి 13 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అమ్మవారికి అలంకరిస్తారు.
కార్యక్రమాల వివరాలు ఇలా :
శాకంబరీ ఉత్సవాలు ఎందుకు చేస్తారు?
పూర్వం దుర్గమాసురుడనె రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం వందల సంవత్సరాల తపస్సు చేశారు. ఆ తపస్సు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వేదాలు అందరూ మర్చిపోవాలని, వేద జ్ఞానం అంతా తనకే రావాలని వరం కోరుతాడు. బ్రహ్మ వరంతో అతి తక్కువ సమయంలో అందరు వేదాలు మర్చిపోయారు. యజ్ఞయాగాదులు లేక దేవతలకు పూజలు లేక వర్షాలు కురవడం లేదు. ప్రపంచమంతా కరువు కాటకాలు సంభవించాయి. అది చూసిన రుషులు చలించిపోయి సుమేరు పర్వతం గుహలలోకి వెళ్లి జగన్మాతను ప్రార్థిస్తారు. వారి ప్రార్థన విన్న ఆ తల్లి విని వారి ఎదుట నీలివర్ణంతో అనేకమైన కళ్లతో శతాక్షి అనే నామంతో చతుర్భుజములుతో కనిపించింది. ధనుర్బణాలతో ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి తొమ్మిది రోజులపాటు కన్నుల నీరు కార్చింది. ఆమె కన్నిటితో అన్ని నదులు నిండిపోయాయి. వారి దుస్థితిని చూడలేక ఆ తల్లి శాకంబరీగా అవతరించింది. అమ్మ శరీరభాగాలుగా కూరలను, పండ్లను, గింజలను, గడ్డి మొదలైనవి ఉండగా తన శరీరభాగాలను అంటే శాకములను అన్ని జీవాలకు ఇచ్చింది. ఆ రాక్షసుడిని చంపి అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి ప్రజల ఆకలిని తీర్చింది అని చెబుతారు. అందుకే ఆషాఢమాసంలో దేవీక్షేత్రాలలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి పూజిస్తారు.
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!
Guntur News : వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి, రోడ్డుపై బైఠాయించిన ఓ కుటుంబం
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?