అన్వేషించండి

Kesineni Nani: రాధాపై రెక్కీ ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలి... అనుచరులుగా నటిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు... ఎంపీ కేశినేని నాని కామెంట్స్

టీడీపీ నేత వంగవీటి రాధాను ఎంపీ కేశినేని నాని ఆయన నివాసంలో కలిశారు. రాధాపై రెక్కీని సీబీఐతో విచారణ జరిపించాలని కేశినేని డిమాండ్ చేశారు.

టీడీపీ నేత వంగవీటి రాధాను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. సోమవారం రాధా నివాసానికి వచ్చిన ఎంపీ కేశినేని నాని.. రెక్కీకి సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు. ఎంపీ నానితో పాటు  టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కూడా రాధాను పరామర్శించారు. రాధాపై రెక్కీ ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని కేశినేని డిమాండ్‌ చేశారు. వంగవీటి కుటుంబం రాష్ట్రానికి ఓ సంపద అని ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ఎంపీగా వంగవీటి రాధా రక్షణ కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానన్నారు. వంగవీటి కుటుంబానికి అనుచరులుగా నటిస్తూ కొందరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

Also Read: నన్ను హత్య చేసేందుకు రెక్కీ చేశారు... నేను దేనికైనా రెడీ... వంగవీటి రాధాకృష్ణ

ఇటీవలే చంద్రబాబు పరామర్శ

వంగవీటి రాధాకృష్ణను టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల పరామర్శించారు. రెక్కీ నిర్వహించిన దానికి సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు  పట్టించుకోవడం లేదని సమావేశం తర్వాత చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు అసలేమీ చెప్పడం లేదన్నారు. రాధా రెక్కీ విషయం చెప్పిన తర్వాత అసలేం జరిగిందన్నదానిపై ఆందరిలోనూ ఆందోళన ఏర్పడిందన్నారు. ఆ దిశగా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవన్నారు. ఇలాంటి పనులు చేసే వారిని పట్టుకుని శిక్షిస్తే మరొకరు అలాంటి ప్రయత్నాలు చేయరని చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగినా తర్వాత మాత్రం ఖండించారు. దీంతో  రెక్కీ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని వంగవటి రాధా వర్గీయులు భావిస్తున్నారు. 

Also Read: టీడీపీ హయాంలోనే రంగా హత్య... రాధా హత్యకు రెక్కీపై ఆధారాలు ఇస్తే దర్యాప్తు చేస్తాం... మంత్రి వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు

రెక్కీపై ఎలాంటి ఆధారాలు లేవు 

వంగవీటి రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ సీపీ కాంతి రాణా అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీపీ కాంతి రాణా టాటా.. వంగవీటి రాధాపై రెక్కీ గురించి ఆయన ఇచ్చిన సమాచారం తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై అవాస్తవాలు ప్రసారం చేయొద్దని ఆయన కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేదని, పోలీసు అధికారులు రాధాతో మాట్లాడారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాస్పద ఘటన జరగనప్పుడు కేసు ఎలా పెడతామని సీపీ అన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని సీపీ కాంతి రాణా పేర్కొన్నారు. 

Also Read: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Embed widget