అన్వేషించండి

Jagananna Vidya Deevena : రేపు తిరువూరులో సీఎం జగన్ టూర్, బటన్ నొక్కి విద్యా దీవెన నిధులు విడుదల

Jagananna Vidya Deevena : ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19న జగనన్న విద్యా దీవెన పథకం నిధులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.

Jagananna Vidya Deevena : సీఎం జగన్ రేపు(ఆదివారం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. రేపు తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆదివారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరు చేరుకుంటారు. 11.00 – 12.30 గంటలకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

తిరువూరులో సభ 

ఈ నెల 19న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి విద్యా దీవెన నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తారని తెలిపింది. తిరువూరులో ఈ నెల 18న సీఎం జగన్ సభ జరగాల్సి ఉంది. అయితే ఈ సభ పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతుండడంతో ఈ కార్యక్రమం 19వ తేదీకి వాయిదా పడింది. ఈ కళాశాలలో శనివారం ఇంటర్ విద్యార్థులు ఇంగ్లిష్ పరీక్ష రాయనున్నారు. సభ నిర్వహిస్తే విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో సీఎం జగన్ తన సభను వాయిదా వేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. 

మూడు నెలలకు ఒకసారి నగదు జమ

జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందిస్తున్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. కాలేజీలకు కట్టాల్సిన ఫీజులను మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను మూడు నెలలు ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారికి నిధులు అందిస్తుంది. జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా రెండు వాయిదాల్లో ఇంజినీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందిస్తు్న్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్లు జమ

జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్‌ రేపు తిరువూరులో విడుదల చేయనున్నారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్ల నగదును జమచేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడనున్నారు. సీఎం జగన్‌ తిరువూరు పర్యటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ జగన్ సీఎం అయిన తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చారన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో  ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన పథకాన్ని చేరువ చేశామన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget