అన్వేషించండి

Central Government Office Accommodation AP: అమరావతికి కేంద్రం భారీ వరం - రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం!

Infrastructure Projects In Amaravati: కేంద్ర కేబినెట్ అమరావతిలో రూ.1,299 కోట్లతో కేంద్ర కార్యాలయాల భవనాలు, రూ.1,235 కోట్ల నివాసాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 2027లో పనులు ప్రారంభం కానున్నాయి

Union Cabinet Clears Infrastructure Projects In Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక భారీ ఊతాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివ  సమావేశంలో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ శాఖల కోసం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. మొత్తం రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుల వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా అమరావతిలో కేంద్ర పరిపాలనా యంత్రాంగం పటిష్టం కానుందని ఆయన స్పష్టం చేశారు.

కేబినెట్ నిర్ణయాల ప్రకారం.. సుమారు రూ.1,299.08 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాన్ని (CGGPOA) నిర్మించనున్నారు. అమరావతిలోని 5.53 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 23.25 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో రెండు భారీ బ్లాకులుగా దీనిని రూపొందించనున్నారు. ఇందులో ఒక బ్లాక్ 13 అంతస్తులు, మరో బ్లాక్ 10 అంతస్తులతో నిర్మితమవుతుంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల నుండి విడివిడిగా నడుస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూలను   ఒకే పైకప్పు కిందకు తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ అత్యాధునిక కాంప్లెక్స్‌లో దాదాపు 8,000 మంది అధికారులు, సిబ్బంది పనిచేయడానికి వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నారు.

దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి సమస్యను తీర్చడానికి రూ.1,234.91 కోట్ల  వ్యయంతో భారీ నివాస సముదాయం నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని 17 ఎకరాల విస్తీర్ణంలో, 31.3 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో 11 అధునాతన టవర్లను నిర్మించనున్నారు. వీటిలో టైప్-II నుండి టైప్-VI కేటగిరీల పరిధిలో మొత్తం 1,504 క్వార్టర్లను ఏర్పాటు చేస్తారు. రాజధాని ప్రాంతంలో తగిన అద్దె ఇళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్న కేంద్ర ఉద్యోగులకు ఈ హౌసింగ్ కాంప్లెక్స్ ఎంతో ప్రయోజనకరంగా మారడమే కాకుండా, వారు పని ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి వీలవుతుంది.   

ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పర్యావరణ హితంగా, అత్యున్నత గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో GRIHA 4-స్టార్ రేటింగ్  నిర్మించనున్నారు. ఈ క్యాంపస్‌లలో ఉద్యోగుల కోసం బ్యాంకులు, ఏటీఎంలు, పోస్ట్ ఆఫీస్, క్రెచ్  , కమ్యూనిటీ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ మరియు దివ్యాంగులకు ఎలాంటి అడ్డంకులు లేని వీల్ చైర్ అనుకూల రవాణా సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే, దాదాపు 1,800 నుండి 2,000 వాహనాల పార్కింగ్ సామర్థ్యాన్ని ఈ సముదాయాలలో అందుబాటులోకి తెస్తున్నారు. నిర్మాణ దశలో ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా సుమారు 7 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొంది.

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్  ఈ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది. వీటికి సంబంధించిన ప్రీ-బిడ్   ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమవగా, టెండర్ డాక్యుమెంట్ల తయారీ శరవేగంగా జరుగుతోంది. రాబోయే కొద్ది నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిగా పూర్తి చేసి, 2027 ప్రారంభంలో క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టం చేసి నులు వేగవంతం చేసిన తరుణంలో, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాజధాని నిర్మాణానికి మరింత ఊపునివ్వనుంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget