Central Government Office Accommodation AP: అమరావతికి కేంద్రం భారీ వరం - రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం!
Infrastructure Projects In Amaravati: కేంద్ర కేబినెట్ అమరావతిలో రూ.1,299 కోట్లతో కేంద్ర కార్యాలయాల భవనాలు, రూ.1,235 కోట్ల నివాసాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 2027లో పనులు ప్రారంభం కానున్నాయి

Union Cabinet Clears Infrastructure Projects In Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక భారీ ఊతాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివ సమావేశంలో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ శాఖల కోసం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. మొత్తం రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుల వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా అమరావతిలో కేంద్ర పరిపాలనా యంత్రాంగం పటిష్టం కానుందని ఆయన స్పష్టం చేశారు.
కేబినెట్ నిర్ణయాల ప్రకారం.. సుమారు రూ.1,299.08 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాన్ని (CGGPOA) నిర్మించనున్నారు. అమరావతిలోని 5.53 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 23.25 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో రెండు భారీ బ్లాకులుగా దీనిని రూపొందించనున్నారు. ఇందులో ఒక బ్లాక్ 13 అంతస్తులు, మరో బ్లాక్ 10 అంతస్తులతో నిర్మితమవుతుంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల నుండి విడివిడిగా నడుస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, పీఎస్యూలను ఒకే పైకప్పు కిందకు తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ అత్యాధునిక కాంప్లెక్స్లో దాదాపు 8,000 మంది అధికారులు, సిబ్బంది పనిచేయడానికి వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నారు.
దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి సమస్యను తీర్చడానికి రూ.1,234.91 కోట్ల వ్యయంతో భారీ నివాస సముదాయం నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని 17 ఎకరాల విస్తీర్ణంలో, 31.3 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో 11 అధునాతన టవర్లను నిర్మించనున్నారు. వీటిలో టైప్-II నుండి టైప్-VI కేటగిరీల పరిధిలో మొత్తం 1,504 క్వార్టర్లను ఏర్పాటు చేస్తారు. రాజధాని ప్రాంతంలో తగిన అద్దె ఇళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్న కేంద్ర ఉద్యోగులకు ఈ హౌసింగ్ కాంప్లెక్స్ ఎంతో ప్రయోజనకరంగా మారడమే కాకుండా, వారు పని ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి వీలవుతుంది.
Andhra Pradesh CM N Chandrababu Naidu (@ncbn) posts, "I offer my sincere thanks to the Union Cabinet, led by Hon’ble Prime Minister Shri Narendra Modi ji, for approving the Central Government General Pool Office Accommodation (CGGPOA) project in Amaravati. This important decision… pic.twitter.com/XfrntVoEYg
— Press Trust of India (@PTI_News) June 10, 2026
ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పర్యావరణ హితంగా, అత్యున్నత గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో GRIHA 4-స్టార్ రేటింగ్ నిర్మించనున్నారు. ఈ క్యాంపస్లలో ఉద్యోగుల కోసం బ్యాంకులు, ఏటీఎంలు, పోస్ట్ ఆఫీస్, క్రెచ్ , కమ్యూనిటీ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ మరియు దివ్యాంగులకు ఎలాంటి అడ్డంకులు లేని వీల్ చైర్ అనుకూల రవాణా సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే, దాదాపు 1,800 నుండి 2,000 వాహనాల పార్కింగ్ సామర్థ్యాన్ని ఈ సముదాయాలలో అందుబాటులోకి తెస్తున్నారు. నిర్మాణ దశలో ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా సుమారు 7 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొంది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది. వీటికి సంబంధించిన ప్రీ-బిడ్ ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమవగా, టెండర్ డాక్యుమెంట్ల తయారీ శరవేగంగా జరుగుతోంది. రాబోయే కొద్ది నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిగా పూర్తి చేసి, 2027 ప్రారంభంలో క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టం చేసి నులు వేగవంతం చేసిన తరుణంలో, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాజధాని నిర్మాణానికి మరింత ఊపునివ్వనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















