అన్వేషించండి

TTD Board Meeting : సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ అప్పుడే, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే!

TTD Board Meeting : భక్తుల రద్దీ తగ్గే వరకూ సర్వదర్శనానికి ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. యంత్రాల సాయంతో లడ్డూ ప్రసాదం, బూందీ తయారీ విధానం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది.

TTD Board Meeting : భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయకూడదని టీటీడీ  కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ కొనసాగే వరకూ సర్వదర్శనం భక్తులకు ప్రస్తుత విధానమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శనం స్లాటెడ్ విధానంలో టోకెన్లు కేటాయింపుపై అధ్యాయనం చేస్తున్నామని టీటీడీ తెలిపింది. ఆనంద నిలయం గోపురానికి బంగారు తాపడం పనులకు ఆమోదం తెలిపారు. ఆగమ పండితుల సలహాల మేరకు నెల రోజుల తరువాత పనులు ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

టైం స్లాట్ టోకెన్లపై 

ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులకు పాలక మండలి ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలక మండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు పాలక మండలిలో ఆమోదం తెలిపామన్నారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. భక్తుల రద్దీ తగ్గే వరకూ సర్వదర్శనంలోనే శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ప్రస్తుత విధానమే కొనసాగిస్తామన్నారు. టైం స్లాట్ టోకెన్ల విధానంపై అధ్యాయనం కొనసాగుతుందన్నారు. 

సింఘానియా గ్రూప్స్ తో ఒప్పందం

దేశ వ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకూ నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 7.32 కోట్లతో ఎస్వీ గోశాల పశుగ్రాసం కొనుగోలు చేయనున్నామని తెలిపారు. 2.7 కోట్ల వ్యయంతో పాత పార్వేటి మండపం స్థానంలో‌ నూతన మండపం నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 154 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు చేసినట్లు వెల్లడించారు. తిరుమలలోని ఎస్వీ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు సింఘానియా గ్రూప్స్ తో ఒప్పందం కుదుర్చేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 

యంత్రాలతో లడ్డూ ప్రసాదం తయారీ

18 లక్షల వ్యయంతో బేడీ ఆంజనేయస్వామికి బంగారు కవచం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చెన్నైలో ఆరు కోట్లు, బెంగుళూరులో 3.23 కోట్ల విలువైన ఆస్తులు భక్తులు విరాళంగా అందించారని మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది ముఫ్పై మూడు లక్షల కేలండర్లు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి నెల 2.1 లక్షల సప్తగిరి మాస పత్రికలను ముద్రిస్తున్నట్లు చెప్పారు. యంత్రాల సహాయంతో లడ్డూ ప్రసాదం, బూందీ తయారీపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.  ప్రసాదాల తయారీకి వినియోగించే ఆర్గానిక్ ముడి సరుకుల కొనుగోలుకు మార్క్ ఫేడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఆనంద నిలయం గోపురానికి బంగారు తాపడం చేయించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని, ఆగమ పండితుల సలహాల మేరకు నెల రోజుల అనంతరం తాపడం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనున్నామని తెలిపారు. ఆక్టోపస్ కోసం కేటాయించిన భవన నిర్మాణం కోసం అదనంగా ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget