అన్వేషించండి

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - స్వామి వారి కానుకలు వేలం ఎప్పుడో తెలుసా?

Andhra News: శ్రీవారి కానుకలను వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. వేలాన్ని ఆఫ్ లైన్ విధానంలో నిర్వహిస్తామని.. ఆసక్తి గల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనాలని అధికారులు తెలిపారు.

TTD Announced Auction Of Hundi Items: తిరుమల (Tirumala) శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వెంకటేశుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో చాలా మంది నగదు సహా కొన్ని వస్తువులను స్వామి వారికి కానుకగా ఇస్తుంటారు. బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, విదేశీ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, ఖరీదైన కెమెరాలు, మొబైల్స్, చేతి వాచీలు సహా ఇతర వస్తువులు కానుకగా సమర్పిస్తుంటారు. వీటిని వేలంలో భక్తులు సొంతం చేసుకునే అవకాశాన్ని దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు. వేలాన్ని ఆఫ్ లైన్ విధానంలో నిర్వహిస్తామని.. ఆసక్తి గల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనాలని టీటీడీ సూచించింది.

ఏం వేలం వేస్తారంటే.?

తిరుమలతో పాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయనున్నారు. ఈ నెల 28న భక్తులు సమర్పించిన కెమెరాలను వేలం వేస్తారు. మొత్తం 6 లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న కాపర్ - 2 రేకులు 3 వేల కేజీలను 15 లాట్లుగా పెట్టి వేలం వేస్తారు. ఈ నెల 31న సిల్వర్ కోటెడ్ రాగి రేకులు 2,400 కేజీలను 12 లాట్లుగా పెట్టి వేలం వేయనున్నారు.  టెండర్ లేదా వేలంలో పాల్గొనాలనుకునే భక్తులు మరింత సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ ఆఫీసులో సంప్రదించాలన్నారు. దూర ప్రాంతాల వారు 0877 - 2264429 నెంబరుకు కాల్ చేయడం లేదా www.tirumala.org ద్వారా కూడా టెండర్, వేలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు.

రూ.300 దర్శన టికెట్లు విడుదల

మరోవైపు, నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన కోటా టికెట్లను టీటీడీ శనివారం విడుదల చేసింది. ఇప్పటికే అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అటు, వసతి గదుల కోటా టికెట్లను సైతం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తెచ్చింది. https://ttdevasthanams.ap.gov.in సైట్‌లో వీటిని బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తిరుమల - తిరుపతి సేవా కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నవనీత సేవా టికెట్లను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవా టికెట్లను మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఈ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

అటు, శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకూ వీటిని రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా వీటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. శుక్రవారం 69,098 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా.. 34,707 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్

వీడియోలు

WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Shubman Gill, Jadeja in Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఆడనున్న గిల్, జడేజా
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Embed widget