అన్వేషించండి

Top Headlines: ఏపీలో నామినేటెడ్ పదవుల పండుగ - ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, టాప్ హెడ్ లైన్స్

Top News: ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In Telugu States:

1. ఏపీలో 20 నామినేటెడ్ పదవులతో తొలి జాబితా విడుదల

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన వారందరికీ ఈ పదవులు దక్కాయి. ఈ నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన లీడర్లు ఎదురు చూస్తున్నారు. వీటి భర్తీలో కూడా కూటమి నేతలపై ఎంతో ఒత్తిడి ఉంది. కీలకమైన పోస్టుల భర్తీలో పీఠముడి వీడకపోవడంతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబుపవన్ కల్యాణ్, పురందేశ్వరి చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇంకా చదవండి.

2. టికెట్లు త్యాగం చేసిన వారికి ఎదురొచ్చిన పదవులు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇరవై కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేశారు, ఇందులో అత్యధిక మంది టిక్కెట్లు త్యాగం చేయడమే కాదు పార్టీ కోసం కష్టపడి పని చేశారు. వారందరికీ చంద్రాబబు గుర్తింపు ఇచ్చారు. నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ 2019లో అదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీకి హ్యాండివడంతో చివరి క్షణంలో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎన్నికల్లో కోటంరెడ్డి పార్టీలోకి రావడంతో ఆయనకే టిక్కెట్ కేటాయించారు. ఇంకా చదవండి.

3. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు హీరో కార్తీ క్షమాపణలు

తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రభుత్వ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కావాలనే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో కార్తీ 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ వేడుకలో లడ్డూ టాపిక్ వచ్చినప్పుడు 'అది సెన్సిటివ్ ఇష్యూ' అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చదవండి.

4. మండల స్థాయిలోనే జనం సమస్యలకు పరిష్కారం 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లలో గ్రీవెన్స్ డే నిర్వహించేవారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజావాణి పేరుతో అర్జీలు స్వీకరిస్తున్నారు. తొలినాళ్లలో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ ప్రచారం కల్పించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లలో యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. గ్రీవెన్స్ డే పేరు మారింది కానీ, ప్రజావాణి వల్ల ఉపయోగం ఎంతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందుకే దీనిపై ఫోకస్ చేసిన ప్రభుత్వం మరింత పకడ్బంధీగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇంకా చదవండి.

5. హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. ఉదయం ఐదు గంటల  నుంచి ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇళ్లు, కార్యాలయాలపై తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్‌ని ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. బొల్లా రామకృష్ణ న్యూస్ ఛానల్‌తోపాటు ఫైనాన్స్‌, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Embed widget