అన్వేషించండి

Actor Karthi: తిరుమల లడ్డూ వివాదం... పవన్‌కు క్షమాపణలు చెప్పిన కార్తీ - అపార్థం చేసుకోవద్దంటూ ట్వీట్

లడ్డూ గురించి తాను చేసిన కామెంట్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని తమిళ నటుడు కార్తీ కోరారు. తన మాటలను దయచేసి అపార్థం చేసుకోవద్దంటూ పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.

Karthi Apologizes To Pawan Kalyan: తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రభుత్వ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కావాలనే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో కార్తీ 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ వేడుకలో లడ్డూ టాపిక్ వచ్చినప్పుడు 'అది సెన్సిటివ్ ఇష్యూ' అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కార్తి స్పందించారు. తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఆలోచనలేదని, ఒకవేళ ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమించాలని కార్తీ కోరారు. “డియర్ పవన్ కల్యాణ్ సర్.. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్తున్నాను. నేను శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తుడిని. మన సంప్రదాయాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను” అని వివరణ ఇచ్చారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో తాజాగా ‘సత్యం సుందరం’ అనే సినిమా తెరకెక్కింది. సూర్య దంపతులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తెలుగులో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో కార్తీని యాంకర్ మంజూష “లడ్డూ కావాలా నాయనా?” అని అడగడంతో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. “ప్రస్తుతం లడ్డూ టాపిక్ అస్సలు మాట్లాడుకోకూడదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా లడ్డూ టాపిక్ సెన్సిటివ్ గా మారింది. ఇలాంటి సమయంలో దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్” అన్నారు.

కార్తీ కామెంట్స్ పై పవర్ స్టార్ ఆగ్రహం

కార్తీ లడ్డూ గురించి చేసిన కామెంట్స్ పై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఏదైనా మాట్లాడే ముందుకు ఒకటికి వందసార్లు ఆలోచించాలన్నారు. “లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి ఇలా అనకండి. ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి” అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హీరో కార్తి స్పందించారు. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం కార్తీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం పంథాలకు పోకుండా కార్తీ క్షమాపణలు చెప్పడం మంచి విషయం అంటున్నారు నెటిజన్లు. అందుకే, కార్తీని తెలుగు సినీ అభిమానులు అంతగా ఇష్టపడుతారుని కామెంట్స్ పెడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Belikekick (@belikekick)

Read Also: లేడీ కొరియోగ్రాఫర్‌కు అల్లు అర్జున్ సాయం... అసలు విషయం చెప్పేసిన ‘పుష్ప 2’ నిర్మాత

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Savitri : 'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

వీడియోలు

Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Savitri : 'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
Embed widget