అన్వేషించండి

Today Top Headlines తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ధరణి పోర్టల్ ఇక నుంచి 'భూమాత', శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి

Top Five Headlines: ఏపీ, తెలంగాణలో శుక్రవారం జరిగిన టాప్ 5 ముఖ్య వార్తలు మీ కోసం. ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Top Five Headlines In AP And Telangana:

1. తెలంగాణ క్రీడాకారులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్

హర్యానా, పంజాబ్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి... క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేపట్టే చర్యలను వివరించారు. హర్యానా, పంజాబ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టే మంచి చర్యలపై కచ్చితంగా అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా చదవండి.

2. 'ధరణి' పోర్టల్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.  ధరణీతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ...ధరణీ చట్టం మూడు తలలతో మొదలై.. 33 తలలతో అవతరించిందన్నారు.  అసెంబ్లీ ఎన్నికల ముందు భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సమయంలో ఎక్కడికి వెళ్లినా ధరణీ సమస్యల గురించే  ప్రజలు ఆయనకు వివరించారన్నారు.  ధరణీని బంగాళఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని  గుర్తు చేశారు. ఇంకా చదవండి.

3. స్కిల్ వర్శిటీలో తొలి ఏడాది 2 వేల మందికి ట్రైనింగ్

తెలంగాణ యువతలో నైపుణ్యాల కల్పనకు ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 57 ఎకరాల్లో ఈ వర్సిటీని నిర్మించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో కలిసి వర్సిటీ నిర్మాణానికి ఆగస్టు 1న ఈ మేరకు శంకుస్థాపన చేశారు. వర్సిటీతోపాటు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌, ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లకు కూడా శంకుస్థాపన చేశారు. కొత్త విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని.. అప్పటివరకు ఆగకుండా ఈ ఏడాది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కి)లో ఆరు కోర్సులతో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 1న శాసనసభలో ప్రకటించారు. ఇంకా చదవండి.

4. సీఎం చంద్రబాబుపై పీసీసీ మాజీ చీఫ్ రఘువీరా ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అభినందించారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి రఘువరన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కార్యకర్తలను బలవంతంగా తీసుకెళ్లకుండా ఆర్భాటాల్లేకుండా సాదాసీదాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాగే రాజకీయ పార్టీ నేతలు కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకా చదవండి.

5. శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి

శ్రీశైలం ఆలయంలో (Srisailam Temple) ఓ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరు కావడం కలకలం రేపింది. గురువారం రాత్రి 9 గంటలకు ఆలయంలోని క్యూ కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. మద్యం సేవించి విధులకు హాజరైన ఉద్యోగిని గుర్తించిన భక్తులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కొందరు భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆలయంలో అపచారం జరిగిందని.. ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చదవండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma: అన్నీ ఉమ్మడి ఆస్తులే - అందరికీ సమానంగా చెందుతాయి - వైఎస్ విజయమ్మ సంచలన అఫిడవిట్
అన్నీ ఉమ్మడి ఆస్తులే - అందరికీ సమానంగా చెందుతాయి - వైఎస్ విజయమ్మ సంచలన అఫిడవిట్
Lokesh Latest News: వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 
వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 
Ambedkar Konaseema Latest News: మృతదేహం త‌ర‌లింపులో వివాదం- చివ‌రి మ‌జిలీలోనూ వివ‌క్ష చూపిస్తున్నారంటూ ద‌ళిత సంఘాల ఆందోళన!
మృతదేహం త‌ర‌లింపులో వివాదం- చివ‌రి మ‌జిలీలోనూ వివ‌క్ష చూపిస్తున్నారంటూ ద‌ళిత సంఘాల ఆందోళన!
Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్
ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana Budget 2026-27: 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Embed widget