అన్వేషించండి

YV Subbareddy: శ్రీవాణి ట్రస్టు విరాళాలపై టీటీడీ కీలక ప్రకటన- దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యమని వివరణ

YV Subbareddy: శ్రీవాణి ట్రస్టు విరాళలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. దళారీ వ్యవస్ధను నిర్మూలించేందుకే శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

YV Subbareddy: శ్రీవాణి ట్రస్ట్ నిధుల్లో దుర్వినియోగం జరుగుతుందనంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టుకి మే నెల వరకు 861 కోట్లను భక్తులు విరాళాలుగా సమర్పించగా, 602 కోట్ల 60 లక్షలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినట్లు వెల్లడించారు. కరెంటు అకౌంట్‌లో 139 కోట్ల నిధులు ఉన్నాయని, 120.24 కోట్లని వివిధ కార్యక్రమాలకు గాను ఖర్చు చేయగా, శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్లు ద్వారా 36.50 కోట్ల వడ్డీ వచ్చిందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. 2019 సెప్టెంబర్ 23వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ కీ విరాళాలు సమర్పించిన భక్తులకీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని, శ్రీవాణి ట్రస్టుకీ రూ 500, 300లకు భక్తులకీ రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని వెల్లడించారు. అలాగే శ్రీవాణి ట్రస్టుకీ విరాళాలు ఇచ్చిన భక్తులకి రాజ్య మార్గం ద్వారా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామన్నారు.

శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ప్రారంభించిన తర్వాత దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి, మొదటి ఆరు నెలల్లోనే ప్రక్షాలన చేపట్టామన్నారు. ఇప్పటి  వరకు 70 మంది దళారులను అరెస్ట్ చేసి, 214 కేసులు నమోదు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 8 లక్షల మందికీపైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకోగా ఎవరూ ఆరోపణలు చేయలేదన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళ్తే.. రసీదులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీటీడీపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడు దర్శనానికి వచ్చారో చెబితే పరిశీలించి తాము రసీదులు ఇస్తామన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మండిపడ్డారు.

నిన్నటికి నిన్న వివరణ ఇచ్చిన ఏవీ ధర్మారెడ్డి

 శ్రీవాణి ట్రస్టు విరాళాలు దుర్వినియోగం కాలేదని, హిందూ దేవాలయాల నిర్మించేందుకు నిధులను వినియోగిస్తున్నట్లు టిటిడి ఈవో ఏవీ.ధర్మారెడ్డి స్పష్టం చేశారు.. గురువారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి టిటిడి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్టు విరాళాలపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.  తిరుమలో విశ్వహిందూ పరిషత్ ట్రస్ట్ సభ్యులు శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన విషయాలను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు.. ఇప్పటి వరకు 6 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శించుకోగా.. 8 లక్షల 24 వేల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం అందించినట్లు తెలిపారు. రూ.860 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ విరాళం అందాయని, పది వేల విరాళం ఇచ్చి, రూ.500 టికెట్ కోసం చెల్లిస్తారని తెలిపారు. రూ.500 టికెట్ ఉంటే మూడు వందలకు రశీదు ఇస్తే భక్తులు ఎవ్వరు ఊరుకోరని, ఇలాంటి ఆరోపణలు చేస్తే భగవంతునిపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కాగజ్‌నగర్ ప్రభుత్వం పాఠశాలలో అగ్ని ప్రమాదం- వంటగదిలో గ్యాస్‌ లీక్‌తో దుర్ఘటన 
కాగజ్‌నగర్ ప్రభుత్వం పాఠశాలలో అగ్ని ప్రమాదం- వంటగదిలో గ్యాస్‌ లీక్‌తో దుర్ఘటన 
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
TTD Darshan Fraud Arrest: దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు
దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget