అన్వేషించండి

YV Subbareddy: శ్రీవాణి ట్రస్టు విరాళాలపై టీటీడీ కీలక ప్రకటన- దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యమని వివరణ

YV Subbareddy: శ్రీవాణి ట్రస్టు విరాళలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. దళారీ వ్యవస్ధను నిర్మూలించేందుకే శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

YV Subbareddy: శ్రీవాణి ట్రస్ట్ నిధుల్లో దుర్వినియోగం జరుగుతుందనంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టుకి మే నెల వరకు 861 కోట్లను భక్తులు విరాళాలుగా సమర్పించగా, 602 కోట్ల 60 లక్షలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినట్లు వెల్లడించారు. కరెంటు అకౌంట్‌లో 139 కోట్ల నిధులు ఉన్నాయని, 120.24 కోట్లని వివిధ కార్యక్రమాలకు గాను ఖర్చు చేయగా, శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్లు ద్వారా 36.50 కోట్ల వడ్డీ వచ్చిందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. 2019 సెప్టెంబర్ 23వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ కీ విరాళాలు సమర్పించిన భక్తులకీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని, శ్రీవాణి ట్రస్టుకీ రూ 500, 300లకు భక్తులకీ రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని వెల్లడించారు. అలాగే శ్రీవాణి ట్రస్టుకీ విరాళాలు ఇచ్చిన భక్తులకి రాజ్య మార్గం ద్వారా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామన్నారు.

శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ప్రారంభించిన తర్వాత దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి, మొదటి ఆరు నెలల్లోనే ప్రక్షాలన చేపట్టామన్నారు. ఇప్పటి  వరకు 70 మంది దళారులను అరెస్ట్ చేసి, 214 కేసులు నమోదు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 8 లక్షల మందికీపైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకోగా ఎవరూ ఆరోపణలు చేయలేదన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళ్తే.. రసీదులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీటీడీపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడు దర్శనానికి వచ్చారో చెబితే పరిశీలించి తాము రసీదులు ఇస్తామన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మండిపడ్డారు.

నిన్నటికి నిన్న వివరణ ఇచ్చిన ఏవీ ధర్మారెడ్డి

 శ్రీవాణి ట్రస్టు విరాళాలు దుర్వినియోగం కాలేదని, హిందూ దేవాలయాల నిర్మించేందుకు నిధులను వినియోగిస్తున్నట్లు టిటిడి ఈవో ఏవీ.ధర్మారెడ్డి స్పష్టం చేశారు.. గురువారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి టిటిడి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్టు విరాళాలపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.  తిరుమలో విశ్వహిందూ పరిషత్ ట్రస్ట్ సభ్యులు శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన విషయాలను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు.. ఇప్పటి వరకు 6 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శించుకోగా.. 8 లక్షల 24 వేల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం అందించినట్లు తెలిపారు. రూ.860 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ విరాళం అందాయని, పది వేల విరాళం ఇచ్చి, రూ.500 టికెట్ కోసం చెల్లిస్తారని తెలిపారు. రూ.500 టికెట్ ఉంటే మూడు వందలకు రశీదు ఇస్తే భక్తులు ఎవ్వరు ఊరుకోరని, ఇలాంటి ఆరోపణలు చేస్తే భగవంతునిపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
Chitram Choodara Movie Review - చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
Chitram Choodara Movie Review - చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
Embed widget