అన్వేషించండి

MVV Satyanarayana: 3 రాజధానుల బిల్లు మరోసారి సభలో ప్రవేశ పెడతాం: వైఎస్సార్‌సీపీ ఎంపీ

రాష్ట్ర అభివృద్ధి ఒకే చోట ఉండకుండా, రాష్ట్ర నలువైపులా వ్యాప్తి చెందాలనే పేదరికం నిర్మూలన సాధ్యం అవుతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు

3 Capitals For Andhdra Pradesh: తిరుపతి : పేదరిక నిర్మూలన అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం అవుతుందని, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించుకోవడం జరిగిందని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం స్వామి వారి వస్త్రం, స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని ఆశీస్సులు పొందారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి కోసమే.. 
అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి ఒకే చోట ఉండకుండా, రాష్ట్ర నలువైపులా వ్యాప్తి చెందాలనే పేదరికం నిర్మూలన సాధ్యం అవుతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని తెలిపారు. ఏదోక ప్రాంతంలో కొంతమంది అభివృద్ధి కోసం రాజధాని ఏర్పాటు చేయడం కాకుండా, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, అమరావతి రాజధానిగా, కర్నూలు న్యాయరాజధానిగా చేయాలని తెలియజేయడమే కాకుండా ధృడ సంకల్పంతో సీఎం పని చేస్తున్నారన్నారు. 

పని గట్టుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులపై విమర్శలు
రాబోయే ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కూడా చేర్చబోతున్నారని, అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు చదువులను ప్రోత్సహిస్తున్నారని, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఏర్పాటు చేశారని, కొందరు పని గట్టుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులపై విమర్శలు చేసారని, ఇది సరైన విధానం కాదని, పేదలు ఇంగ్లీషు మీడియం చదువులోకూడదని, పేదవారు పేదవారిగానే మిగిలి పోవాలని కొందరు కుట్ర పొందుతున్నారని ఆయన చెప్పారు.. 2024లో మరో సారి ప్రజలంతా అఖండ విజయంను వైసీపి అందించబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానుల ప్రకటన చేయడం జరిగిందని, మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టబోతున్నారని, ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఎవరూ‌ కూడా మూడు రాజధానులను ఆపలేరని ఎంపీ సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

శ్రీవారి సేవలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పి.వి.సింధు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల పివి.సింధు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, చాలా రోజుల తరువాత స్వామి వారి దర్శనానికి వచ్చానని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించానన్నారు. తన కాలికి గాయం కావడంతో ప్రస్తుతం తాను విశ్రాంతిలో ఉన్నానని, రాబోయే సంవత్సరం నుండి టోర్నమెంట్స్ ఉన్నాయని, అందులో బాగా ఆడాలని స్వామి వారిని కోరుకున్నట్లు పివి.సింధు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget