అన్వేషించండి

MVV Satyanarayana: 3 రాజధానుల బిల్లు మరోసారి సభలో ప్రవేశ పెడతాం: వైఎస్సార్‌సీపీ ఎంపీ

రాష్ట్ర అభివృద్ధి ఒకే చోట ఉండకుండా, రాష్ట్ర నలువైపులా వ్యాప్తి చెందాలనే పేదరికం నిర్మూలన సాధ్యం అవుతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు

3 Capitals For Andhdra Pradesh: తిరుపతి : పేదరిక నిర్మూలన అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం అవుతుందని, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించుకోవడం జరిగిందని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం స్వామి వారి వస్త్రం, స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని ఆశీస్సులు పొందారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి కోసమే.. 
అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి ఒకే చోట ఉండకుండా, రాష్ట్ర నలువైపులా వ్యాప్తి చెందాలనే పేదరికం నిర్మూలన సాధ్యం అవుతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని తెలిపారు. ఏదోక ప్రాంతంలో కొంతమంది అభివృద్ధి కోసం రాజధాని ఏర్పాటు చేయడం కాకుండా, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, అమరావతి రాజధానిగా, కర్నూలు న్యాయరాజధానిగా చేయాలని తెలియజేయడమే కాకుండా ధృడ సంకల్పంతో సీఎం పని చేస్తున్నారన్నారు. 

పని గట్టుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులపై విమర్శలు
రాబోయే ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కూడా చేర్చబోతున్నారని, అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు చదువులను ప్రోత్సహిస్తున్నారని, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఏర్పాటు చేశారని, కొందరు పని గట్టుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులపై విమర్శలు చేసారని, ఇది సరైన విధానం కాదని, పేదలు ఇంగ్లీషు మీడియం చదువులోకూడదని, పేదవారు పేదవారిగానే మిగిలి పోవాలని కొందరు కుట్ర పొందుతున్నారని ఆయన చెప్పారు.. 2024లో మరో సారి ప్రజలంతా అఖండ విజయంను వైసీపి అందించబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానుల ప్రకటన చేయడం జరిగిందని, మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టబోతున్నారని, ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఎవరూ‌ కూడా మూడు రాజధానులను ఆపలేరని ఎంపీ సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

శ్రీవారి సేవలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పి.వి.సింధు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల పివి.సింధు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, చాలా రోజుల తరువాత స్వామి వారి దర్శనానికి వచ్చానని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించానన్నారు. తన కాలికి గాయం కావడంతో ప్రస్తుతం తాను విశ్రాంతిలో ఉన్నానని, రాబోయే సంవత్సరం నుండి టోర్నమెంట్స్ ఉన్నాయని, అందులో బాగా ఆడాలని స్వామి వారిని కోరుకున్నట్లు పివి.సింధు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget