అన్వేషించండి

YS Sharmila: సత్యవేడులో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఓట్లకు డబ్బులు బాగా ఇస్తారు తీసుకోండి: షర్మిల సంచలనం

Andhra Pradesh News: సత్యవేడులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రతి పనికి రేటు ఫిక్స్ చేస్తారని.. ఓట్ల కోసం ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Election 2024- సత్యవేడు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎంతో  అభివృద్ధి జరిగి ఉండేది  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎంతో  అభివృద్ధి జరిగి ఉండేదని, రాష్ట్రాన్ని 10 ఏళ్లలో చంద్రబాబు, వైఎస్ జగన్ (YS Jagan) సర్వనాశనం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. సత్యవేడులో ఇద్దరు ఎమ్మెల్యే లు ఉన్నారట, ఎమ్మెల్యే కొడుకు షాడో ఎమ్మెల్యే అని.. ఓట్ల కోసం ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోవాలంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల న్యాయ యాత్ర కొనసాగుతోంది. సత్యవేడులో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న షర్మిల మాట్లాడుతూ... సత్యవేడులో ఎమ్మెల్యే ఉన్నాడా ? లేడా? ఎమ్మెల్యే కొడుకు సైతం షాడో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి పనిలో ఒక రేట్ ఫిక్స్ చేస్తారట. ఇక్కడ మొత్తం మట్టి మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్నారు. ఎన్నికల్లో మళ్లీ నెగ్గేందుకు మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తారు, వాళ్లతో డబ్బులు తీసుకుని ఓటు ఎవరికి వేయాలో ఆలోచించాలని సత్యవేడు ప్రజలకు సూచించారు. సత్యవేడులో ఎమ్మెల్యేగా బాలగురవం బాబు, తిరుపతి ఎంపీగా చింతా మోహన్ లను గెలిపించాలని ప్రజల్ని కోరారు.

వైఎస్సార్ హయాంలోనే అభివృద్ధి..
వైఎస్ఆర్ హయంలోనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగింది. శ్రీ సిటి పెట్టారు.300 పరిశ్రమలు తెచ్చి లక్షమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ దే. గాలేరు - నగరి ద్వారా ఇక్కడ ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని వైఎస్సార్ 90 శాతం పనులు పూర్తి చేశారు. పెండింగ్ లో ఉన్న మిగతా 10 శాతం పనులను 5 ఏళ్లలో చంద్రబాబుకి, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ కి పూర్తి చేయడం చేతకాలేదు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు - వైఎస్ షర్మిల

రాజధాని లేకుండా చేశారు
ఏపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రాజధాని ఒకటి. 10 ఏళ్లు గడుస్తున్నా చంద్రబాబు, జగన్ పాలించినా ఏపీకి రాజధాని లేకుండా చేశారని షర్మిల మండిపడ్డారు. ఇప్పటికీ ఏపీ ప్రజలు హైదరాబాద్,చెన్నై,  బెంగళూర్ వైపు చూడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదన్నారు. హోదా కోసం చంద్రబాబు, జగన్ పోరాటాలు చేయలేదని.. బీజేపీకి ఇద్దరు బానిసలు అయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్ప చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు. 

జగన్ పాలనపై షర్మిల సెటైర్లు
ప్రతి సభలోనూ తాను బటన్ నొక్కినట్లు చెప్పే సోదరుడు జగన్ పాలనపై షర్మిల సెటైర్లు వేశారు. ఓ వైపు బటన్ నొక్కుతూ, మరోవైపు నుంచి లాక్కోవడం ఇదే వైసిపి పాలన అని షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ కుంభకర్ణుడు గత నాలుగున్నరేళ్లు నిద్ర పోయాడు, ఇప్పుడు లేచి హడావుడి చేస్తున్నారంటూ ఏపీ సీఎంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు నోటిఫికేషన్ లు వేస్తే ఉద్యోగాలు వస్తాయా? మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మడం నిజం కాదా? జగన్ ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. 60 రూపాయలు బాటిల్ 260 రూపాయలకు అమ్ముతున్నారు. జగన్ హామీలు అన్ని మద్యం షాపులో కనిపిస్తున్నాయి. బూమ్ బూమ్ బీర్లట.. స్పెషల్ స్టేటస్ విస్కీ అంట. డీఎస్సీ బ్రాండి అంట అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

కాంగ్రెస్ తోనే రాష్ట్రం అభివృద్ది 
తాము అధికారంలో వస్తె 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇళ్లులేని పేద కుటుంబానికి 5 లక్షలతో ఇల్లు... మహిళా పేరు మీద ఏటా లక్ష రూపాయలు, ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాలను తక్షణం భర్తీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. వికలాంగులకు 6 వేల పెన్షన్, వృద్దులకు, వితంతువులకు, రూ.4 వేల పెన్షన్, ఉపాది పథకం కింద రోజు రూ.400 ఇస్తామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget