అన్వేషించండి

Big Breaking : తిరుమల వచ్చే ముందు ఆలోచించుకోండి! భక్తులకు టీటీడీ కీలక సూచన

తిరుమల వచ్చే ముందు ఆలోచించుకోండి. దేవుడి దర్శనానికి ఎంత టైం అయినా పట్టొచ్చు. దానికి తగ్గట్టుగా ప్రిపేర్‌ అయ్యి రమ్మని చెబుతోంది.

సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుమలలో భక్తులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. పైన ఎండ కింద ఇసుకేస్తే రాలనంత జనం.  పిల్లలు పెద్దవాళ్లు ముసలివాళ్లు అంతా దైవదర్శనం టోకెన్ల కోసం ఎగబడ్డారు. దీంతో తిరుమలలో కిక్కిరిసిపోయింది. 

ఉదయం నుంచి భక్తులు పడుతున్న పాట్లు చూసిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో విధానంలో సర్వ దర్శన టోకెన్ల 
జారీ ప్రక్రియను నిలిపేసింది. కరోనాకు ముందు ఉన్న విధానాన్ని పునరుద్దరించింది. 

టోకెన్లు లేకుండానే భక్తులను తిరుమలకు అనుమతించాలని నిర్ణయించింది. దీంతో రెండేళ్ల తరువాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతించనున్నారు. 2020 మార్చి 21వ తేది నుంచి భక్తులును కంపార్టుమెంట్లలోకి అనుమతించడం నిలిపివేసింది టిటిడి.

ఈ ప్రకటన చేస్తూ టీటీడీ ప్రకటన జారీ చేసింది. భక్తుల అధిక రద్దీ కారణంగా తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్లలో టోకెన్ల జారీ నిలిపివేస్తున్నామని టోకెన్ లేకుండా కూడా భక్తులను సర్వదర్శనానికి తిరుమలకు అనుమతించడం జరుగుతోందన్నారు. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులకు దర్శనం జాప్యం అయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి సంసిద్దులై భక్తులు తిరుమలకు రావాల్సిందిగా రిక్వస్ట్ చేసింది టీటీడీ.

టీటీడీ ప్రణాళిక లోపం కారణంగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. కరోనా తగ్గినప్పటి నుంచి క్రమంగా అన్ని దర్శనాల టికెట్లు పెంచుతూ వస్తున్న దేవస్థానం ఉచిత దర్శనాల టికెట్లపై మాత్రం దృష్టి పెట్టలేదు. రోజూ భక్తులు వస్తున్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది. ఇదే ఇప్పటి ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 

గత వారంలో హెచ్చరికగా ఓ రోజు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఒకే రోజులు యాభైవేల మంది దర్శనానికి క్యూ కట్టారు. దాని ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకునే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ అవేమీ పట్టించుకోలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీటీడీ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎలాంటి ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా టోకెన్ సిస్టమ్ తీసేసి నేరుగా ఉచిత దర్శనాలకు అనుమతిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. అందుకే భక్తులను ఆ దిశగా మానసికంగా సిద్దం చేసింది. అంటే ఒకసారి ఇప్పుడు దర్శనానికి ఎంట్రీ లభిస్తే ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేరు. అన్ని దర్శనాలను క్యాన్సిల్ చేసి ఇప్పుడున్న భక్తులందర్నీ నేరుగా పంపించడం వల్ల ఎప్పటికీ ప్రక్రియ పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఇలాంటి పరిస్థితి ఉన్నందునే తిరుమల వచ్చే భక్తులు ఆలోచించుకోవాలని టీటీడీ ప్రకటన జారీ చేసింది. స్వామి దర్శనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉన్నందున దానికి తగ్గట్టు ప్రిపేర్డ్‌గా రావాలని రిక్వస్ట్ చేస్తోంది. ఒకసారి ఈ సర్వదర్శన క్యూలోకి ఎంట్రీ లభిస్తే మళ్లీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. ఎన్ని గంటలైనా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. భక్తులు ఆ మేరకు రెడీ అవ్వాల అని టీటీడీ సూచిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Telugu TV Movies Today: ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Telugu TV Movies Today: ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
Saudi Arabia Snowfall: సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
Kitchen to Wellness : ఆరోగ్యం, చర్మ సంరక్షణకై ఇంటి చిట్కాలు.. వంటింట్లో దాగున్న మసాలా దినుసులు చేసే మేజిక్ ఇదే
ఆరోగ్యం, చర్మ సంరక్షణకై ఇంటి చిట్కాలు.. వంటింట్లో దాగున్న మసాలా దినుసులు చేసే మేజిక్ ఇదే
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
Embed widget