అన్వేషించండి

Big Breaking : తిరుమల వచ్చే ముందు ఆలోచించుకోండి! భక్తులకు టీటీడీ కీలక సూచన

తిరుమల వచ్చే ముందు ఆలోచించుకోండి. దేవుడి దర్శనానికి ఎంత టైం అయినా పట్టొచ్చు. దానికి తగ్గట్టుగా ప్రిపేర్‌ అయ్యి రమ్మని చెబుతోంది.

సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుమలలో భక్తులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. పైన ఎండ కింద ఇసుకేస్తే రాలనంత జనం.  పిల్లలు పెద్దవాళ్లు ముసలివాళ్లు అంతా దైవదర్శనం టోకెన్ల కోసం ఎగబడ్డారు. దీంతో తిరుమలలో కిక్కిరిసిపోయింది. 

ఉదయం నుంచి భక్తులు పడుతున్న పాట్లు చూసిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో విధానంలో సర్వ దర్శన టోకెన్ల 
జారీ ప్రక్రియను నిలిపేసింది. కరోనాకు ముందు ఉన్న విధానాన్ని పునరుద్దరించింది. 

టోకెన్లు లేకుండానే భక్తులను తిరుమలకు అనుమతించాలని నిర్ణయించింది. దీంతో రెండేళ్ల తరువాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతించనున్నారు. 2020 మార్చి 21వ తేది నుంచి భక్తులును కంపార్టుమెంట్లలోకి అనుమతించడం నిలిపివేసింది టిటిడి.

ఈ ప్రకటన చేస్తూ టీటీడీ ప్రకటన జారీ చేసింది. భక్తుల అధిక రద్దీ కారణంగా తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్లలో టోకెన్ల జారీ నిలిపివేస్తున్నామని టోకెన్ లేకుండా కూడా భక్తులను సర్వదర్శనానికి తిరుమలకు అనుమతించడం జరుగుతోందన్నారు. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులకు దర్శనం జాప్యం అయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి సంసిద్దులై భక్తులు తిరుమలకు రావాల్సిందిగా రిక్వస్ట్ చేసింది టీటీడీ.

టీటీడీ ప్రణాళిక లోపం కారణంగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. కరోనా తగ్గినప్పటి నుంచి క్రమంగా అన్ని దర్శనాల టికెట్లు పెంచుతూ వస్తున్న దేవస్థానం ఉచిత దర్శనాల టికెట్లపై మాత్రం దృష్టి పెట్టలేదు. రోజూ భక్తులు వస్తున్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది. ఇదే ఇప్పటి ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 

గత వారంలో హెచ్చరికగా ఓ రోజు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఒకే రోజులు యాభైవేల మంది దర్శనానికి క్యూ కట్టారు. దాని ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకునే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ అవేమీ పట్టించుకోలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీటీడీ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎలాంటి ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా టోకెన్ సిస్టమ్ తీసేసి నేరుగా ఉచిత దర్శనాలకు అనుమతిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. అందుకే భక్తులను ఆ దిశగా మానసికంగా సిద్దం చేసింది. అంటే ఒకసారి ఇప్పుడు దర్శనానికి ఎంట్రీ లభిస్తే ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేరు. అన్ని దర్శనాలను క్యాన్సిల్ చేసి ఇప్పుడున్న భక్తులందర్నీ నేరుగా పంపించడం వల్ల ఎప్పటికీ ప్రక్రియ పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఇలాంటి పరిస్థితి ఉన్నందునే తిరుమల వచ్చే భక్తులు ఆలోచించుకోవాలని టీటీడీ ప్రకటన జారీ చేసింది. స్వామి దర్శనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉన్నందున దానికి తగ్గట్టు ప్రిపేర్డ్‌గా రావాలని రిక్వస్ట్ చేస్తోంది. ఒకసారి ఈ సర్వదర్శన క్యూలోకి ఎంట్రీ లభిస్తే మళ్లీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. ఎన్ని గంటలైనా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. భక్తులు ఆ మేరకు రెడీ అవ్వాల అని టీటీడీ సూచిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget