అన్వేషించండి

Big Breaking : తిరుమల వచ్చే ముందు ఆలోచించుకోండి! భక్తులకు టీటీడీ కీలక సూచన

తిరుమల వచ్చే ముందు ఆలోచించుకోండి. దేవుడి దర్శనానికి ఎంత టైం అయినా పట్టొచ్చు. దానికి తగ్గట్టుగా ప్రిపేర్‌ అయ్యి రమ్మని చెబుతోంది.

సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుమలలో భక్తులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. పైన ఎండ కింద ఇసుకేస్తే రాలనంత జనం.  పిల్లలు పెద్దవాళ్లు ముసలివాళ్లు అంతా దైవదర్శనం టోకెన్ల కోసం ఎగబడ్డారు. దీంతో తిరుమలలో కిక్కిరిసిపోయింది. 

ఉదయం నుంచి భక్తులు పడుతున్న పాట్లు చూసిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో విధానంలో సర్వ దర్శన టోకెన్ల 
జారీ ప్రక్రియను నిలిపేసింది. కరోనాకు ముందు ఉన్న విధానాన్ని పునరుద్దరించింది. 

టోకెన్లు లేకుండానే భక్తులను తిరుమలకు అనుమతించాలని నిర్ణయించింది. దీంతో రెండేళ్ల తరువాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతించనున్నారు. 2020 మార్చి 21వ తేది నుంచి భక్తులును కంపార్టుమెంట్లలోకి అనుమతించడం నిలిపివేసింది టిటిడి.

ఈ ప్రకటన చేస్తూ టీటీడీ ప్రకటన జారీ చేసింది. భక్తుల అధిక రద్దీ కారణంగా తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్లలో టోకెన్ల జారీ నిలిపివేస్తున్నామని టోకెన్ లేకుండా కూడా భక్తులను సర్వదర్శనానికి తిరుమలకు అనుమతించడం జరుగుతోందన్నారు. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులకు దర్శనం జాప్యం అయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి సంసిద్దులై భక్తులు తిరుమలకు రావాల్సిందిగా రిక్వస్ట్ చేసింది టీటీడీ.

టీటీడీ ప్రణాళిక లోపం కారణంగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. కరోనా తగ్గినప్పటి నుంచి క్రమంగా అన్ని దర్శనాల టికెట్లు పెంచుతూ వస్తున్న దేవస్థానం ఉచిత దర్శనాల టికెట్లపై మాత్రం దృష్టి పెట్టలేదు. రోజూ భక్తులు వస్తున్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది. ఇదే ఇప్పటి ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 

గత వారంలో హెచ్చరికగా ఓ రోజు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఒకే రోజులు యాభైవేల మంది దర్శనానికి క్యూ కట్టారు. దాని ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకునే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ అవేమీ పట్టించుకోలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీటీడీ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎలాంటి ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా టోకెన్ సిస్టమ్ తీసేసి నేరుగా ఉచిత దర్శనాలకు అనుమతిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. అందుకే భక్తులను ఆ దిశగా మానసికంగా సిద్దం చేసింది. అంటే ఒకసారి ఇప్పుడు దర్శనానికి ఎంట్రీ లభిస్తే ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేరు. అన్ని దర్శనాలను క్యాన్సిల్ చేసి ఇప్పుడున్న భక్తులందర్నీ నేరుగా పంపించడం వల్ల ఎప్పటికీ ప్రక్రియ పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఇలాంటి పరిస్థితి ఉన్నందునే తిరుమల వచ్చే భక్తులు ఆలోచించుకోవాలని టీటీడీ ప్రకటన జారీ చేసింది. స్వామి దర్శనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉన్నందున దానికి తగ్గట్టు ప్రిపేర్డ్‌గా రావాలని రిక్వస్ట్ చేస్తోంది. ఒకసారి ఈ సర్వదర్శన క్యూలోకి ఎంట్రీ లభిస్తే మళ్లీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. ఎన్ని గంటలైనా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. భక్తులు ఆ మేరకు రెడీ అవ్వాల అని టీటీడీ సూచిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Renigunta Railway Station: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
Embed widget