అన్వేషించండి

Sarva Darshan Tickets: ఆఫ్లైన్‌లో తిరుమలేశుడు సర్వదర్శనం టోకెన్లు, ఎన్ని జారీ చేస్తుందంటే?

కరోనాతో తిరుమలేశుడి దర్శనాల క్రమమే మారిపోయింది. ఇప్పుడు కేసులు తగ్గుతున్న తరుణంలో మళ్లీ యథావిధిగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. ముందుగా సర్వదర్శన టోకెన్లు జారీకి యత్నిస్తోంది.

అఖిలాండ కోటి బ్రహ్మాండ‌ నాయకుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రాయాసలకోర్చి తిరుమలకు చేరుకుంటారు భక్తులు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్ధం తిరుమలకు చేరుకునే భక్తులకు టిటిడి‌ వివిధ రూపాల్లో దర్శనం కల్పిస్తుంది.. సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, శ్రీవాణి‌ట్రస్టు, ఆర్జిత సేవ, వివిధ ట్రస్టులకు విరాళాలు అందించిన దాతలకు దర్శనం ఇలా అనేక రూపాల్లో టిటిడి భక్తులకు స్వామి వారి‌ దర్శన భాగ్యం‌ కల్పిస్తుంది. ఇలా వివిధ పద్దతుల్లో స్వామీ వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు పూనీతులు అవుతుంటారు. 

కరోనాకు ముందు కరోనా తర్వాత 

కరోనా కంటే ముందు వరకూ టిటిడిలో‌ కొనసాగేది అలా ఉంటే కరోనా తర్వాత దర్శనాల తీరు మారిపోయింది. కోవిడ్ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే‌ భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తున్నారు.  వీటన్నింటినీ అలిపిరి‌ తనిఖీ కేంద్రం వద్ద  టిటిడి విజిలెన్స్ సిబ్బంది చెక్ చేసి భక్తులను తిరుమల కొండకు అనుమతిస్తున్నారు. 

కరోనా రూల్స్‌ తప్పనిసరి

కొండకు చేరుకున్న ప్రతి భక్తుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించే విధంగా టిటిడి‌ చర్యలు చేపడుతుంది. పరిమిత సంఖ్యలోనే‌ ఆన్లైన్‌లో విడుదల చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ‌ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ ఆర్జిత సేవ టిక్కెట్లు కలిగిన భక్తులనే ప్రస్తుతం తిరుమలకు అనుమతిస్తుంది‌ టిటిడి. కోవిడ్ మహమ్మారి కారణంగా‌ సర్వదర్శనాన్ని రెండు ఏళ్ళ‌గా నిలిపి వేసింది. దీంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

గ్రామీణ ప్రాంత భక్తుల్లో అసంతృప్తి

సామన్య భక్తుల కోసం ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేసేందుకు టీటీడీ చాలా సార్లు ట్రై చేసింది. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండడం, క్యూలైన్స్ వద్ద అధిక రద్దీ కారణంతో జారీని వాయిదా వేస్తూ వచ్చింది. 
ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఆన్లైన్ ద్వారా టోకెన్లు కేటాయిస్తుంది టిటిడి. ఇలా ఆన్లైన్ టోకెన్లు జారీ చేయడంతో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో‌ భక్తులకు దర్శన టోకెన్లు అందడం లేదు. స్వామి వారి దర్శనానికి దూరమవుతున్నామన్న అసంతృప్తి వారిలో ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని భక్తుల‌ వద్ద నుంచి టిటిడికి భారీగా లేఖలు వస్తున్నాయి. దీంతో టిటిడి ఆలోచనలో పడింది. అందుకే ఆప్లెన్‌ టికెట్‌ జారీ ప్రారంభించాలని భావించింది. 

15 నుంచి సర్వదర్శనం టోకెన్లు

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో సర్వదర్శనం టోకెన్లపై టిటిడి‌ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆఫ్లైన్‌లో నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస, గోవిందరాజ సత్రాల్లో సర్వదర్శనం టోకెన్లు‌ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రాల వద్ద ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటించే‌ విధంగా‌ క్యూలైన్‌లో గుర్తులు వేస్తోంది‌ టిటిడి. 

వచ్చే నెలలో ఆర్జిత సేవలకు అనుమతి!

దాదాపు రెండు ఏళ్ళ తరువాత మొదటిసారి‌ సామాన్య భక్తుల కోసం అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టిక్కెట్లు టిటిడి జారీ చేయడంపై శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది మార్చి నెలలో జరుగబోవు టిటిడి పాలక మండలి సమావేశంలో శ్రీవారి ఆర్జిత సేవలపై టిటిడి నిర్ణయం తీసుకోనుంది. ఆర్జిత సేవలకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. 

టాప్ హెడ్ లైన్స్

YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget