తిరుమలకు కాలినడకన కొండపైకి వెళ్తున్న ఒక వందేళ్లకు పైబడిన వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. శ్రీవేంకటేశ్వర స్వామిపై ఆమె అచంచలమైన భక్తికి ఇది నిదర్శనం.
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
కాలినడకన తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల చెన్నై వృద్ధురాలు నవనీతమ్మ వీడియో వైరల్ కావడంతో, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు స్పందించి ఆమె కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.

- శ్రీవారి భక్తురాలి వైరల్ వీడియోతో చైర్మన్ ప్రత్యేక దర్శనం కల్పించారు.
- నవనీతమ్మగా గుర్తించి, కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేశారు.
- కుటుంబంతో వీఐపీ దర్శనం పొందిన ఆమెకు, ఈవో ఆశీర్వాదం పొందారు.
TTD Chairman BR Naidu | తిరుపతి: ఇటీవల కాలినడకన తిరుమలకు కొండపైకి వెళ్తున్న ఒక వందేళ్లు పైగా వయసున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. శ్రీవేంకటేశ్వర స్వామిపై ఆ 116 ఏళ్ల వృద్ధురాలికి ఉన్న అచంచలమైన భక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు చలించిపోయారు. ఆ వృద్ధ భక్తురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం చేయించాలని టీటీడీ చైర్మన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలంటూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా నెటిజన్లను విజ్ఞప్తి చేశారు.
రంగంలోకి విజిలెన్స్ అధికారులు – నవనీతమ్మగా గుర్తింపు
చైర్మన్ విజ్ఞప్తిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి వివరాల కోసం ప్రయత్నించారు. ఆ వృద్ధురాలిని తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ సిబ్బంది ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి తిరుమల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Also Read: మధురై మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు?
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం – మురిసిపోయిన కుటుంబ సభ్యులు
టీటీడీ చైర్మన్ నిర్ణయం ప్రకారం సోమవారం ఉదయం వృద్ధురాలైన నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చైర్మన్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా విఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. బయోమెట్రిక్ కౌంటర్ వద్ద సిబ్బంది దగ్గరుండి ఆమెను ఆలయంలోనికి తీసుకెళ్లారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర సమక్షంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు.
ఈఓ రవిచంద్ర స్వయంగా వృద్ధురాలికి పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను అందజేశారు. అంతటితో ఆగకుండా ఆ శతాధిక వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతీ మాట్లాడుతూ.. ‘ఆ శ్రీనివాసుడి రూపంలో టీటీడీ చైర్మన్ మా అమ్మమ్మకు, మా కుటుంబానికి ఇంతటి అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీకి, చైర్మన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Frequently Asked Questions
ఆ వృద్ధురాలి వీడియో ఎందుకు వైరల్ అయ్యింది?
ఆ వృద్ధురాలి పేరు ఏమిటి మరియు ఆమె ఎక్కడ నుండి వచ్చింది?
ఆ వృద్ధురాలి పేరు నవనీతమ్మ. ఆమె తమిళనాడు రాజధాని చెన్నైకి చెందినవారు.
టీటీడీ చైర్మన్ వృద్ధురాలికి ప్రత్యేక దర్శనం ఎందుకు ఏర్పాటు చేశారు?
వృద్ధురాలి అచంచలమైన భక్తికి ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా చలించిపోయారు. అందుకే ఆమెకు ప్రత్యేక శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.
దర్శనం తర్వాత టీటీడీ అధికారులు ఆమెను ఎలా గౌరవించారు?
టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర స్వయంగా వృద్ధురాలికి పట్టువస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసి, ఆమె కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.
ఈ ప్రత్యేక దర్శనంపై నవనీతమ్మ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు?
నవనీతమ్మ మనవడు దిక్పతీ భావోద్వేగానికి లోనై, టీటీడీ చైర్మన్ శ్రీనివాసుడి రూపంలో తమకు అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారని ధన్యవాదాలు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు























