అన్వేషించండి

Parakamani theft case: పరకామణి చోరీ ఘటనపై కొత్తగా క్రిమినల్ కేసు - టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం

TTD board: పరకామణి చోరీ కేసులో టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది.

TTD board takes key decisions in Parakamani theft case:   తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మంగళవారం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో  పెదజీయర్ మఠం ఉద్యోగి రవికుమార్ 900 అమెరికన్ డాలర్లు   దొంగిలించిన కేసును లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకుని, ఆ రాజీ భాగంగా 14.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని టీటీడీకి విరాళంగా ఇచ్చిన వ్యవహారం వెనుక ఉన్న లోతైన కుట్రను పూర్తిగా బయటపెట్టేందుకు కొత్త క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది.

900 డాలర్లు దొంగించి పధ్నాలుగున్నర కోట్ల ఆస్తులు రాసిచ్చిన రవికుమార్ 

పెదజీయర్ మఠం ఉద్యోగి రవికుమార్  పరకామణి విభాగంలో  విదేశీ కానుకలు లెక్కించే బాధ్యతల్లో ఉండేవారు.  ఒక వ్యక్తి హుండీలో పడిన విదేశీ కరెన్సీని దొంగిలించడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం  పట్టుకుని అతనిపై కేసు పెట్టింది. కానీ కేసు విచారణలో ఉండగానే లోక్‌అదాలత్‌లో రాజీకి చేసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 14.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని టీటీడీకి విరాళంగా తీసుకున్నారు. అప్పటి బోర్డు దాన్ని అంగీకరించింది. కానీ “కేవలం 75 వేల రూపాయల దొంగతనం కోసం 14.5 కోట్ల భూమి ఎందుకు ఇచ్చాడు?” అనే ప్రశ్న ప్రస్తుత టీటీడీ బోర్డుకు వచ్చింది.      

ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో 

ప్రస్తుతం ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలోకి ఉంది. 2025 అక్టోబర్ 7న  హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ డీజీపీ పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇదే అంశం మరో రెండు కేసుల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఇంతలో ఈ రాజీకి కారకుడైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఈ కేసులో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.  అందుకే మంగళవారం   టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ విషయం లోతుగా చర్చించారు. పాత కేసు తిరిగి తెరిచినా విచారణ పరిధి చాలా పరిమితం అవుతుందని, అందువల్ల కుట్ర మొత్తం బయటపడదని బోర్డు గుర్తించింది. అందుకే కొత్తగా క్రిమినల్ ఫిర్యాదు చేసి, ఈ రాజీ వెనుక ఉన్న ముసుగులు తొలగించాలని, గతంలో  దాచిపెట్టిన  ఇతర దొంగతనాలు, దుర్వినియోగాలు కూడా బయటపడేలా చూడాలని నిర్ణయించారు.

పాత దొంగంతనాలన్నీ బయటకు వచ్చేలా మరోసారి క్రిమినల్ కేసు 

2023 సెప్టెంబర్ 9న తిరుపతి కోర్టులో జరిగిన లోక్‌అదాలత్ రాజీని “కుట్రపూరితమైనది” అంటూ పూర్తిగా పక్కన పెట్టేందుకు కూడా బోర్డు సిద్ధమైంది. ఈ చర్య వల్ల ఒకే నేరానికి రెండుసార్లు శిక్ష  ఆరోపణ రాకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నామని బోర్డు స్పష్టం చేసింది. స్వామివారి హుండీలో పడిన ప్రతి రూపాయి దేవుడిదే, భక్తుల విశ్వాసం దేవుడి మీద ఉందని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ చర్యనూ సహించబోమని బోర్డు ప్రకటించింది. ఈ నిర్ణయం పూర్తిగా పరిపాలనాపరంగా, భక్తుల భావాలను, సనాతన ధర్మ పవిత్రతను కాపాడే ఉద్దేశంతోనే తీసుకున్నామని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా పేర్కొన్నారు.        

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget