News
News
వీడియోలు ఆటలు
X

Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్

Tirupati News: సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ శ్రీసిటీని సందర్శించారు. మరింత అభివృద్ధి చెందడానికి అవకాశమున్న అద్భుతమైన ప్రాజెక్ట్ శ్రీసిటీ అంటూ ప్రశంసించారు. 

FOLLOW US: 
Share:

Tirupati News: చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. స్థానిక బిజినెస్ సెంటర్‌ వద్ద శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత  పారిశ్రామికవాడ మౌళిక సదుపాయాలు, సుస్థిరత, హరిత హిత చర్యలు, ప్రగతి, ప్రత్యేకతల గురించి వివరించారు. ఈ పర్యటనపై డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్)లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య మరియు పెట్టుబడి భాగస్వామిగా సింగపూర్ ఎదుగుతున్న క్రమంలో కాన్సుల్ జనరల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. సింగపూర్ నుంచి శ్రీసిటీకి మరిన్ని పెట్టుబడులకు ఈ పర్యటన మార్గం సుగమం చేస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

మరింత అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ప్రాజెక్టు..

శ్రీసిటీలో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, పెట్టుబడిదారుల స్నేహపూర్వక వాతావరణం పట్ల ఎడ్గార్ పాంగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మరింత అభివృద్ధి చెందడానికి అవకాశమున్న అద్భుతమైన ప్రాజెక్ట్ శ్రీసిటీ అంటూ ప్రశంసించారు. శ్రీసిటీలో కొన్ని సింగపూర్ కంపెనీలు ఉండటంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సింగపూర్ కంపెనీలకు శ్రీసిటీ వ్యాపార సామర్థ్యాన్ని తెలిచేయనున్నట్లు పేర్కొన్నారు. శ్రీసిటీ అధికారులతో చర్చల సందర్భంగా  కాన్సుల్ జనరల్ పలు అంశాలపై ప్రశ్నలు అడిగి విషయాలు తెలుసుకున్నారు. వివిధ రంగాలలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక ప్రోత్సాహకాలు, శ్రీసిటీలో వ్యాపారం చేయడం వల్ల కలిగే నిర్దిష్ట ప్రయోజనాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ ప్రాంతీయ డైరెక్టర్ శబరీష్ నాయర్‌తో సహా అధికారుల బృందంతో కాన్సుల్ జనరల్ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలు వీక్షించడంతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్‌ను తయారు చేసే సింగపూర్‌కు చెందిన వైటల్ పేపర్‌ పరిశ్రమను సందర్శించారు.

Published at : 21 Mar 2023 07:46 PM (IST) Tags: AP News Tirupati News Singapore Consul General Edgar Pang Visited Sricity Edgar Pang Latest News

సంబంధిత కథనాలు

TTD News: శ్రీవారి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: శ్రీవారి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

Tirumala News: తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం: టీటీడీ ఈవో

Tirumala News: తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం: టీటీడీ ఈవో

టాప్ స్టోరీస్

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స  తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌