By: ABP Desam | Updated at : 06 Jul 2022 11:21 AM (IST)
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల (Photo Source: Getty Image)
Special Darshan Tickets Online: తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేటి ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
జులై 7న సెప్టెంబరు నెలకు సంబంధించి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఆన్ లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం టికెట్లు విడుదల..
జూన్ 6న ఉదయం 9 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తామని మంగళవారం నాడు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భక్తులకు ఈ నెల 12, 15, 17 తేదీలలో స్వామివారిని దర్శించుకునేందుకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను దేవస్థానం నేడు విడుదల చేసింది. రూ.300 టికెట్ల స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేసినట్లు టీటీటీ అధికారులు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
కరోనా వ్యాప్తి అనంతరం దాదాపు రెండేళ్ల తరువాత ఆన్లైన్ , ఆఫ్ లైన్ విధానంలో భక్తులకు శ్రీవారి దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. గత నెల రోజుల నుంచి తిరుమలలో స్వామి వారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి హుండీకి సైతం కానుకలు భారీగా వస్తున్నాయి. నిన్న ఒక్కరోజులో శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,490 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకోగా, ప్రస్తుతం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందకు దాదాపు 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారి హుండీకి రూ. 4.35 కోట్లు ఆదాయం సమకూరింది. సర్వదర్శనానికి 30 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
2018 జూలై 26న రికార్డు స్థాయిలో రూ.6.28 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి వచ్చాయి. ఆ తరువాత దాదాపు మూడేళ్లకు దాదాపుగా అదే స్థాయిలో హుండీకి కానుకలు చేరాయి. సోమవారంనాడు రికార్డు స్థాయిలో రూ. 6.18 కోట్ల కానుకలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి 6 కోట్ల రూపాయలు పైగా కానుకలు హుండీలో సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Ashada Masam 2022 : ఆషాడాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు!
ఏపీ రాజకీయ వేదికపై ఇంత వరకు చూడని సీన్ ఇవాళ మీరు చూడబోతున్నారు!
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు
Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది
Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!