అన్వేషించండి

Tirumala Laddu: తిరుమల లడ్డూ తయారీపై ఆ వార్తలు నమ్మొద్దు: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

Tirumala Laddu Fact Check | తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నారని టీటీడీ తెలిపింది.

Tirumala Laddu Making Process News | తిరుమల‌: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలపై నిత్యం ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తుంది. గతంలో శ్రీవారి ప్రసాదం (అన్నదానం)పై, ఆపై లడ్డూ బరువు తగ్గించడం, అన్య మతస్తులు టీటీడీలో ఉన్నారని, ఇలా తిరుమలపై నిత్యం ఏదో ఒక అంశం ప్రచారం జరుగుతోంది. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ (Tirupati Laddu) తయారీపై జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) స్పందించింది. లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలొద్దు అని, శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూను తయారు చేస్తున్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీ థామస్ అనే అన్య మతానికి చెందిన కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో లడ్డూలు తయారు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ఇలా స్పందించి, అసత్య వార్తలను నమ్మవద్దని భక్తులకు సూచించింది.

భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ సూచన 
అనాదిగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని తెలిసిందే. ఇటీవల తిరుమల లడ్డూ సైజ్ తగ్గించారని, రేట్లు పెంచారని ప్రచారం జరగగా, టీటీడీ అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. తాజాగా శ్రీవారి లడ్డు ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై టీటీడీ అలర్ట్ అయి, క్లారిటీ ఇచ్చింది. ఎన్నో దశాబ్దాల నుండి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా శ్రీవారి లడ్డూను తయారు చేస్తున్నారని, భక్తులు ఈ విషయంపై ఆందోళన చెందవద్దని పేర్కొంది. కొందరు ఉద్దేశపూర్వకంగా తిరుమల ఆలయంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ స్పష్టం చేసింది. 

తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు లడ్డూ తయారీ విధులను నిర్వహిస్తున్నారు. వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తేవడం లాంటి పనులు చేస్తారు. ఇతరలు, లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డు కౌంటర్లలో పని చేస్తున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. లడ్డూ తయారీపై జరగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూనే, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటాని బుధవారం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 
Also Read: భక్తులకు అలర్ట్, తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలపై టీటీడీ ప్రకటన
      

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget