ఏపీ ప్రభుత్వానికి సాయం చేస్తుందని ప్రచారం- షాకింగ్ నిర్ణయం తీసుకున్న టీటీడీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెక్యూరిటీ డిపాజిట్లు రూపం ఇచ్చే ప్రక్రియ టిటిడికి కొత్తదేం కాదు.

కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడు వైకుంఠాన్ని వదిలి సాలగ్రామ శిలరూపంలో తిరుమలలోని ఆనంద నిలయంలో కొలువైయున్నారు. శ్రీ వేంకటేశ్వరుడి క్షణకాలం పాటు జరిగే దర్శన భాగ్యం కోసం దేశ విదేశాల నుంచి ప్రతి నిత్యం భక్తులు వివిధ రూపాల్లో స్వామి వారి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు. ఇలా తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామి వారికి ముడుపుల రూపంలో వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. భక్తులు స్వామి వారిపై భక్తి భావంతో శ్రీవారి హుండీలో సమర్పించే నగదు కార్పస్ ఫండ్ రూపంలో టీటీడీ వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి భద్రపరుస్తుంది. నగదుతోపాటుగా భక్తులు సమర్పించి బంగారాన్ని సైతం జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉంచుతుంది.
బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వివిధ ట్రస్టులకు విరాళాలు అందిస్తూ ఉంటారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా పది వేల రూపాయలు అందించిన భక్తులకు ప్రివిలేజ్ ద్వారా స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తుంది. అయితే శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నగదును పురాతన ఆలయాలు ఆధునీకరణ, నూతన దేవాలయాలు నిర్మాణం చేపట్టి, ధూపదీపన నైవేద్యాలు సమర్పించేందుకు టిటిడి వినియోగిస్తుంది.
శ్రీ వేంకటేశ్వరుడిపై అపారమైన భక్తితో వేల కిలో మీటర్లు సైతం లెక్క చేయకుండా తిరుమలకు చేరుకుని రోజులు, గంటల తరబడి వేచి ఉండి ఆనంద నిలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్ దర్శనం పొంది పునీతులు అవుతుంటారు.. అంతే కాకుండా శ్రీనివాసుడికి తమ తమ స్తోమతకు తగ్గట్టుగా భక్తులు హుండీ ద్వారా కానుకలు సమర్పిస్తుంటారు.. ఇలా ఏడాది కాలంలో టిటిడికి భక్తులు హుండీ ద్వారా రూ. 700 నుంచి రూ.1000 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది.. ఇలా వచ్చిన నగదును కార్పస్ ఫండ్గా జాతీయ బ్యాంకుల్లో జమ చేస్తుంది టీటీడీ. నగదుతో పాటుగా బంగారును డిపాజిట్ చేసి భద్ర పరుస్తుంది.
ప్రతి మూడు నెలలకు ఓసారి జరిగే పాలక మండలి సమావేశంలో డిపాజిట్లపై టిటిడి ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటుంది. కొందరు సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని టిటిడి ఆదుకుంటోందని ప్రచారం సైతం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టిటిడి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తోంది. కానీ ఇటీవల ఈ ప్రచారం మరింత ఎక్కువగా మారింది.
టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి భక్తులు సమర్పించి నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెక్యూరిటీ డిపాజిట్లు రూపం ఇచ్చే ప్రక్రియ టిటిడికి కొత్తదేం కాదు. 1987వ సంవత్సరంలో సెక్షన్ 111(3) ఎండోమెంట్ యాక్ట్ 30, 1990 గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం టీటీడీ రూల్ నంబర్ 80లో సెక్యూరిటీ డిపాజిట్లు ప్రభుత్వ నియమాలు అనుసారం ప్రభుత్వ అనుమతితో డిపాజిట్ చేయవచ్చని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నిబంధనలను అనుసరించి టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత జరిగిన పాలక మండలి సభ్యులతో డిపాజిట్లపై చర్చించి సాధ్యా సాధ్యాలపై ఓ కమిటీ వేసి పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆనాటి నుంచి నేటి వరకు డిపాజిట్ల వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా నగదు డిపాజిట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే టిటిడి డిపాజిట్ల వ్యవహారంలో జరుగుతున్న ప్రచారంపై శనివారం తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఓ భక్తుడు నేరుగా టిటిడి ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించారు.. భక్తుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఈవో టిటిడి డిపాజిట్ల వ్యవహారాన్ని తెలియజేశారు.
సోషల్ మీడియా వేదికగా టిటిడి డిపాజిట్లపై జరుగుతున్న ప్రచారాన్ని ఈవో ఏవి.ధర్మారెడ్డి ఖండించారు. టిటిడిని టార్గెట్గా చేసుకుని దుష్ప్రచారం చేయడం తగ్గదని హెచ్చరించారు. ఐదు వేల కోట్ల డిపాజిట్లను స్టేట్ గవర్నమెంట్కు బాండ్ల రూపంలో ఇచ్చారనేది ముమ్మాటికీ అవాస్తవమన్నారు. నేషనలైజ్డ్ బ్యాంకులలోనే నగదు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఇలాంటి వందంతులు ఎవరు నమ్మొద్దని భక్తులను టిటిడి ఈవో విజ్ఞప్తి చేశారు.
వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై శ్వేత పత్రాన్ని టీటీడీ విడుదల చేసింది. వైసీపి అధికారంలోకి రాక ముందు ఉన్న డిపాజిట్లు, అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న డిపాజిట్లు వివరాలు వెల్లడించింది.
| బ్యాంకు పేరు | 2019 జూన్ నాటికి డిపాజిట్స్ | 2022 సెప్టెంబర్ నాటికి డిపాజిట్స్ |
| స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా | రూ.10.20 కోట్లు | రూ. 5358.11 కోట్లు |
| యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా | రూ.288.19 కోట్లు | రూ.1694.25 కోట్లు |
| బ్యాంక్ అఫ్ బరోడా | రూ.1956.53 కోట్లు | రూ.1839.36 కోట్లు |
| కెనరా బ్యాంక్ | రూ.4913.73 కోట్లు | రూ. 1351.00 కోట్లు |
| యాక్సిస్ బ్యాంక్ | రూ.151.59 కోట్లు | రూ.1006.20 కోట్లు |
| హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ | రూ.1253.68కోట్లు | రూ. 2122.85 కోట్లు |
| సౌత్ ఇండియన్ బ్యాంక్ | రూ.1229.29 కోట్లు | 0 |
| ఇండస్ ఇండ్ | రూ.1218.99 కోట్లు | 0 |
| హెచ్డిఎఫ్సి బ్యాంక్ | 0 | రూ. 779.17 కోట్లు |
| గవర్నమెంట్ అఫ్ ఇండియా బాండ్స్ | రూ.555.17 కోట్లు | రూ. 555.17 కోట్లు |
| పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 0 | రూ. 660.43 కోట్లు |
| పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ | రూ.4.87 కోట్లు | రూ. 306.31 కోట్లు |
| ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ | 0 | రూ. 101.43 కోట్లు |
| ఇండియన్ బ్యాంక్ | రూ.34.46 కోట్లు | రూ. 25.30 కోట్లు |
| ఫెడరల్ బ్యాంక్ | రూ.80.04 కోట్లు | 0 |
| ఐసీఐసీఐ బ్యాంక్ | 0 | రూ. 9.70 కోట్లు |
| సప్తగిరి గ్రామీణ బ్యాంక్ | రూ.88.31 కోట్లు | రూ. 99.91 కోట్లు |
| బ్యాంకు అఫ్ ఇండియా | రూ.5.53 కోట్లు | 0 |
| యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ | రూ.3.74కోట్లు | రూ. 1839.36 కోట్లు |
| సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా | 0 | రూ. 1.28 కోట్లు |
| కరూర్ వైశ్య బ్యాంక్ | 0 | రూ. 4.37 కోట్లు |
| ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ | రూ. 10.00 కోట్లు | రూ. 4.0 కోట్లు |
| ఏపీ స్టేట్ కో ఆప్షన్ బ్యాంక్ | రూ. 50.77 కోట్లు | రూ. 1.30 కోట్లు |
| మొత్తం | రూ. 13025.09 కోట్లు | రూ. 15938.68 కోట్లు |
బంగారం డిపాజిట్
| బ్యాంకు పేరు | 2019 జూన్ నాటికి డిపాజిట్స్ | 2022 సెప్టెంబర్ నాటికి డిపాజిట్స్ |
| స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా | 53807.56 కేజీలు | 9819.38 కేజీలు |
| ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు | 1952.18కేజీలు | 438.99 కేజీలు |
| మొత్తం | 7339.74 కేజీలు | 10258.37 కేజీలు |





















