By: ABP Desam | Updated at : 14 Jan 2022 08:21 AM (IST)
తిరుమలలో భక్తుల నిరసన (Representational Image)
Devotees Protest at Tirupati Balaji Temple: కలియుగ ప్రత్యక్ష దైవం చిత్తూరు జిల్లాలోని తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వరుడిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వసిస్తారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) భక్తులను పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతిస్తోంది. ఆన్లైన్ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆన్లైన్లోనే సర్వదర్శనం టిక్కెట్లు, తిరుమల-తిరుపతి స్థానికులకు మాత్రం టీటీడీ అధికారులు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు.
శ్రీవారి వైకుంఠ ద్వార (ఉత్తర ద్వారం) దర్శనం చేసుకొనేందుకు ఎంతో భక్తి భావంతో వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఎంతో మెరుగైన ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ గత ఏడాదితో పోల్చితే ఏర్పాట్లు అసలు బాగాలేదని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నామన్న టీటీడీ.. సామాన్య భక్తుల ఏర్పాట్లు గాల్లో వదిలేసి కేవలం వీఐపీల సేవలకు పరిమితం అయిందని భక్తులు వాపోతున్నారు. ఇక కొందరు భక్తులు టీటీడీ అధికారులపై తీవ్రంగా మండి పడితున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కంపార్ట్మెంట్లో కూర్చో బెట్టి రాత్రి ఎనిమిది గంటలకు స్వామి వారి దర్శనానికి వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు.
Koo Appశ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకొనేందుకు ఎంతో భక్తి భావంతో వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఎంతో మెరుగైన ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ గత ఏడాదితో పోల్చితే ఏర్పాట్లు అసలు బాగాలేదని, వీఐపీల సేవలో టీటీడీ సిబ్బంది తరిస్తోందంటూ భక్తులు అసహనం వ్యక్తం చేశారు. #Tirumala #Tirupati...🌹🙏🌹 #VaikuntaEkadasi #TTD https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/tirumala-devotees-protest-at-tirupati-balaji-temple-over-facilities-by-ttd-officials-18261 - Shankar (@guest_QJG52) 14 Jan 2022
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోకుండా అధికారుల తీరుతో బయటకు వెళ్తున్న భక్తులను టీటీడీ సిబ్బంది సర్ది చెప్పే పరిస్థితి గురువారం తలెత్తింది. భక్తులకు ఎలాగోలా సర్దిచెప్పి టీటీడీ సిబ్బంది వారిని స్వామి వారి దర్శనానికి పంపారు. అయితే శ్రీవారి దర్శనంతరం ఆలయం బయటకు వచ్చి భక్తులు ఒక్కసారిగా టీటీడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగ్గారు.
వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ సిబ్బంది శ్రీవారి భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భక్తులు వినిపించుకోక పోవడంతో రంగంలోకి పోలీసులు రంగంలోకి దిగారు. తమ మాటను సైతం భక్తులు లెక్క చేయకపోవడంతో భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తూ వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. టీటీడీ అధికారులు, పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని చెప్పిన టీటీడీ.. వీఐపీలు, వీవీఐపీల సేవలో తరిస్తూ, సామాన్య భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆరోపించారు.
Also Read: Bhogi Wishes in Telugu: భోగ భాగ్యాల భోగి రోజు.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి
ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ
Nara Lokesh Padayatra: నారా లోకేష్ యువగళం 5వ రోజు పాదయాత్ర షెడ్యూల్
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి