అన్వేషించండి

Janasena పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము, ధైర్యం వైసీపీకి లేవు: జనసేన నేత ఫైర్

Janasena leaders Arrested in Vizag: వైసీపీ ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, ఇతర వైసీపీ నతేలపై దాడికి పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

Janasena leaders Arrest: విశాఖ ఏయిర్ పోర్టులో మంత్రి రోజా జబర్దస్త్ షో చేశారని, కావాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి వైసీపీ నేతలు వచ్చారని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మండిపడ్డారు. వైసీపీ ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, ఇతర వైసీపీ నతేలపై దాడికి పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో నిన్న జరిగిన రాళ్ల దాడి, ఆపై అర్ధరాత్రి పోలీసులు పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ కు వెళ్లి జనసేన నేతల్ని అరెస్ట్ చేయడంపై తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా‌ సమావేశంలో జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము, ధైర్యం వైసీపీకి లేవన్నారు.

మూడు నెలల కిందటే పవన్ జనవాణి ఖరారు.. 
అధికార పార్టీ వైసీపీ నేతలే విశాఖ గర్జన పేరుతో ఉద్దేశపూర్వకంగా సభ పెట్టారని, కానీ విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమం మూడు నెలల ముందే ఖరారైందని తెలిపారు కిరణ్ రాయల్. ఎందుకు పనికిరాని రాష్ట్ర మంత్రులు పవన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎయిర్ పోర్టులోకి పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి ఏపీ మంత్రులు అక్కడికి వచ్చారని, వైసీపీ ముందుగానే ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులో రోజా జబర్దస్త్ షో చేయడం ఆపి, ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలన్నారు. దమ్ముంటే పవన్ ని టచ్ చేసి చూడాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతల్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  
మంత్రి రోజా తమిళనాడులో పెళ్లి చేసుకున్నారని, అక్కడ రాజధాని కట్టుకోవాలంటూ జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. రోజాకి విశాఖలో ఏం జరిగిందో తెలుసు. పవన్ పై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజల కోసం పోరాడుతున్న పవన్ పై, జనసేన నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం, నోటీసులు ఇవ్వడం, అసత్య ఆరోపణలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎక్కువ చేస్తే మంత్రి రోజా బయట తిరగనీయకుండా చేస్తామన్నారు. 

కాబోయే సీఎంను అడ్డుకుంటున్నారు !
పవన్ ని చూస్తే వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసి పోతున్నాయని, అందుకే రాష్ట్ర మంత్రులు బాగా యాక్టింగ్ లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కి పవన్ అంటే భయం అని, ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు ఆదరణ పెరగడం చూసి ఏపీ సీఎం భయపడుతున్నారని చెప్పారు. పోలీసు వ్యవస్థ అడ్డుకున్నది కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అని, అది గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తే దాన్ని అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఒకవేళ ప్రజా సమస్యల పరిష్కారమే వైసీపీ నీతి అయితే, జనసేన ఆ పని చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మంత్రులకు వాళ్ళ శాఖపై అవగాహన లేదు, కానీ పవన్ పై విమర్శలు చేయడం, జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టించడం మాత్రం బాగా తెలుసునన్నారు. 
వైజాగ్ లో పవన్ కి ఉన్న ఆదరణ చూడలేక, కడుపు మంటను ఇలా పోలీసులతో అక్రమ అరెస్ట్ లు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ లా.. జగన్ ఏపీలో పరిపాలిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా మద్దతుతో అధికారంలోకి వస్తామని, అప్పుడు వారి పని పడతాం అన్నారు. గంజాయి, ఎర్ర చందనం, ఇసుక మాఫియా అన్ని బయటకు తీస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాలను గుర్తుచేసిందన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget