By: ABP Desam | Updated at : 07 Apr 2023 01:06 PM (IST)
కాంగ్రెస్ నాయకత్వంపై కిరణ్ తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ వీడుతానని అనుకోలేదన్నారు. కాంగ్రెస్ చేసిన పొరపాటు నిర్ణయాలు కారణంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్నారు కిరణ్కుమార్ రెడ్డి. దాని వల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్తిగా నాశనమైందని అభిప్రాయపడ్డారు. కనీసం రాష్ట్రంలో ఎవర్నీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విభజన కోసం ఎవర్ని నియమించారో వాళ్లెవరూ తమతో మాట్లాడలేదన్నారు. పట్టించుకోలేదని ఆరోపించారు.
2019 నాటికి కాంగ్రెస్ ఎంత నష్టపోయిందో.. బీజేపీ అంతకు మించి బలపడిందన్నారు కిరణ్కుమార్ రెడ్డి. జబ్బును కనిపెట్టి దానికి మందు వేయాలనే ఆలోచన కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం కూడా చేయలేకపోయిందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో బలహీనపడుతూ నాశనమయ్యే స్థితికి వచ్చిందని కామెంట్ చేశారు.
#WATCH | "I had never imagined that I'll have to leave Congress...There is a saying- 'My king is very intelligent, he doesn't think on his own, doesn't listens to anyone's advice', "says former Congress leader Kiran Kumar Reddy on joining BJP in Delhi. pic.twitter.com/8s43F09WxK
— ANI (@ANI) April 7, 2023
దేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీ పని చేస్తుందన్నారు కిరణ్కుమార్ రెడ్డి. ఆ విషయంలో బీజేపీ నేతలందరిలో కనిపిస్తోందని అన్నారు. మోదీ, అమిత్షా సహా బీజేపీ అధినాయకత్వం డైరెక్షన్ చాలా బాగుందని కితాబు ఇచ్చారు. నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థత కనిపిస్తోందని అన్నారు. గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ అతి విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాల వల్లే దేశవ్యాప్తంగా పార్టీ ఓటమి పాలవుతూ వస్తోందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అధినాయకత్వం చెప్పిందే వేదం అంటారే కానీ... కింది స్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకునే వాళ్లు ఒక్కరూ లేరని ఎద్దేవా చేశారు. నేతల, పార్టీ శ్రేణుల అభిప్రాయంతో పని లేకుండా నిర్ణయాలు తీసుకుంటారని అందుకే కాంగ్రెస్ క్షీణదశకు చేరిందని విమర్శించారు.
అంతకు ముందు మాట్లాడిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.. కిరణ్కుమార్ రెడ్డి కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారని అన్నారు. ఎంతో గొప్ప పొలిటికల్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కిరణ్ కుమార్రెడ్డి బీజపీలో చేరడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు ప్రహ్లాద్ జోషి. ఆయన రాకతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీకి మరింత బూస్టప్ వచ్చినట్టు అవుతుందన్నారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు ప్రహ్లాద్ జోషి. స్వతహాగా క్రికెటర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇన్నింగ్స్ ప్రారంభించారని... ఇకపై ఏపీలో బ్యాటింగ్ జోరందుకుంటుందని అన్నారు.
#WATCH | Kiran Kumar Reddy, who served as the CM of united Andhra Pradesh, joins Bharatiya Janata Party in Delhi pic.twitter.com/WrlGjG5Uwr
— ANI (@ANI) April 7, 2023
Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్
Top 10 Headlines Today: పోలవరం టూర్కు జగన్, నాగర్ కర్నూల్లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్ వేడుక
Top 10 Headlines Today: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత
AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం
Minister Peddireddy: ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు - స్పష్టత ఇచ్చిన మంత్రి
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్ల రికార్డులు ఎలా ఉన్నాయి?