అన్వేషించండి

Puthalapattu Assembly Constituency: పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?

Chittoor District: పూతలపట్టులో పోటీ రసవసత్తరంగా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నుంచి అభ్యర్థులుగా డాక్టర్లనే బరిలోకి దించారు. ఈ ఇద్దరిలో గెలిచేదెవరు..?

Assembly Election 2024: పూతలపట్టు... చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి కొలువైన నియోజకవర్గం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కూడా. అక్కడ ఆధిపత్యం కోసం వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) ఆరాటపడుతుంటే... ఉనికి కోసం  టీడీపీ (TDP) పోరాడుతోంది. ఈ రెండు పార్టీల నుంచి డాక్టర్లనే అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దింపారు. అందులో ఒకరు... రోగుల నాడిని పరీక్షించే డాక్టర్. మరొకరు... ప్రజల పల్స్‌ తెలిసిన పీహెచ్‌డీ డాక్టర్‌. వీరిద్దరిలో గెలుపు ఎవరిది అన్నది  ఆసక్తికరంగా మారింది. 

ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడింది. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పుడు జరుగుతున్నవి నాలుగో ఎన్నికలు. ఈ నాలుగు ఎన్నికల్లోనూ డాక్టర్లకే పట్టంకట్టారు  పూతలపట్టు ఓటర్లు. దీంతో... వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ కూడా ఈసారి.. డాక్టర్లనే బరిలోకి దింపాయి. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. రోగులు నాడి పట్టి... వైద్యం చేస్తాడు. ఇక...  టీడీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కలికిరి మురళీమోహన్... వృత్తి రిత్యా జర్నలిస్టు. ఆయన పీహెచ్‌డీ చేసి డాక్టర్‌ పట్టా పొందారు. ప్రజల నాడి, ప్రజా సమస్యలపై బాగా తెలిసిన వ్యక్తి. ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరు డాక్టర్ల మధ్యే సమరం జరుగుతోంది. 

గత రెండు ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీదే అధికారం
పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో మొదటి ఎన్నికలు జరిగాయి. అప్పుడు... కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్ పి.రవి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో డాక్టర్‌.సునీల్ కుమార్.. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి  గెలుపొందారు. అయితే... ఆయనపై పలు ఆరోపణలు రావడంతో.. వైసీపీ కేడర్‌ నుంచి సహకారం లభించలేదు. దీంతో... 2019 ఎన్నికల్లో డాక్టర్‌.సునీల్ కుమార్‌ను పక్కన పెట్టి... ఎంఎస్‌ బాబుకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఆ ఎన్నికల్లో ఎంఎస్‌  బాబును గెలిపించి వైసీపీకి మరోసారి అవకాశం ఇచ్చారు పూతలపట్టు ప్రజలు. ఈసారి... పాత ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్‌కు అవకాశం ఇచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు కాంగ్రెస్‌ పార్టీలో చేరి... ఎన్నికల  బరిలో దిగారు. 

పూతలపట్టులో ఓటర్ల సంఖ్య
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలతో పోలిస్తే... పూతలపట్టులోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో లక్షా 99వేల 405 మంది ఓటర్లు ఉన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో 2లక్షల  2వేల 771 మంది ఓటర్లు ఉన్నారు. పూతలపట్టులో ఐదు మండలాలు ఉన్నాయి. 2లక్షల 15వేల 183 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది దళిత ఓటర్లే. 50 నుంచి 55 శాతం దళిత ఓటర్లు ఉంటారు. వీరిలో కూడా... అరవ మాల  సామాజిక వర్గానికి చెందిన వారిదే కీలకపాత్ర. వారి సంఖ్య 30 నుంచి 35 శాతం ఉంటుందని అంచనా. పది నుంచి 15 శాతం తెలుగు మాల సామాజిక వర్గం ఓటర్లు ఉంటారు. వీరే నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారు

2009 నుంచి 2019 ఎన్నికల వరకు...
2004 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన లలిత కుమారి.. 2009 ఎన్నికల్లో పూతలపట్టు నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవికుమార్‌పై 950 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  రవికుమార్‌కు 64,484 ఓట్లు వచ్చాయి. ఇక... 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు 83,200 రాగా... లలిత కుమారి 902 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు గెలిచారు.  ఆయనకు లక్షా 3వేల 265 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి లలిత కుమారికి 74,102 ఓట్లు మాత్రమే వచ్చాయి.

రాష్ట్ర విభజన ముందు జరిగిన చివరి ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విభజన తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండానే ఎగిరింది. గత మూడు ఎన్నికల్లోనూ... టీడీపీ పార్టీ ప్రతిపక్ష పాత్రకే  పరిమితమైంది. నాలుగోసారి అయిన టీడీపీ విజయం సాధిస్తుందా... లేక గత ఫలితాలే రిపీటై వైఆర్‌ఎస్‌సీపీకే మళ్లీ అధికారం లభింస్తుందా.. అన్నది అక్కడి ప్రజలే నిర్ణయించాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Arava Sridhar: పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget