అన్వేషించండి

AP Politics: ఎన్టీఆర్ ఆత్మఘోషతోనే చంద్రబాబు దినదిన పతనం - ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Narayana Swamy Comments against Chandrababu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మఘోష వల్ల చంద్రబాబు దినదిన పతనం మొదలైందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.

Narayana Swamy Comments against Chandrababu: తిరుపతి : టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఉపయోగించుకొని ఓట్లు పొందారని, సీఎం జగన్ మాత్రం బీసీలు విద్యావంతులు అవ్వాలని ఆకాంక్షిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ ఆత్మఘోష వల్ల చంద్రబాబు దినదిన పతనం మొదలైందని చెప్పారు. నారాయణ స్వామి బుధవారం ఉదయం స్వామి తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 

శ్రీవారి ఆలయంలో దర్శనం అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ... కులమత బేధాలు లేకుండా ప్రజల కోసం శ్రమిస్తున్న సీఎం జగన్ కు శ్రీవారు అన్నివిధాలా తోడు ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను ఉపయోగించుకొని ఓట్లు పొందారని, సీఎం జగన్ మాత్రం బీసీలు అన్ని రంగాల్లో రాణించాలని భావించి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. బీసీలు విద్యావంతులు అవ్వాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారని, టీడీపీ నాయకులు వ్యక్తిత్వం లేని వాళ్లు అంటూ మండిపడ్డారు. తిరుమల ఆలయం ముందు చంద్రబాబు గురించి మాట్లాడితే బాగోదని, ఎన్టీఆర్ ఆత్మఘోష వల్ల చంద్రబాబు దినదినాభి పతనం మొదలైందన్నారు.

బీసీలకు ఏమీ ప్రయోజనం చేకూర్చని నేతగా చంద్రబాబు మిగిలిపోతారన్నారు. బీసీలకు అగ్రతాంబూలం ఇస్తూ 5 మందికి మంత్రి పదవి, ఇద్దర్ని ఎంపీలను చేసిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యం అయిందన్నారు. రాష్ట్రంలో బీసీలు బాగుపడాలని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, కానీ ఎన్టీఆర్ పెట్టిన పధకాలను కొనసాగిస్తా అని రెండు రూపాయల బియ్యాన్ని 5 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి, వాడవాడలా బెల్టు షాపులు పెట్టిన ఘనత చంద్రబాబుదే అని చెప్పిన ఆయన, బీసీ జపం చేసి బీసీలను అణగదొక్కిన ఘటనను ఎవరూ మరిపోరని చెప్పారు. 
ఎన్టీఆర్ కు చేసిన ద్రోహానికి చంద్రబాబు పిచ్చివాడిలా మారిపోయే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో వాడవాడలా అభివృద్ధి జరుగుతోందని, రూ.300 కోట్లతో రోడ్లను మా నియోజకవర్గంలో నిర్మించామని నారాయణ స్వామి చెప్పారు. కేవలం తమ నియోజకవర్గంలోనే కల్వకుంట్ల ప్రాజెక్ట్ కు రూ. 190 కోట్లు నిధులు విడుదల అయ్యిందని, అర్బన్, రురల్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అభివృద్ధి కదా అని ఆయన ప్రశ్నించారు. కళ్లు ఉండి చంద్రబాబు అంధుడిగా మారిపోయారని, నిజాలను సైతం వినలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఉద్యోగులకు ఏం చేశారని, రాయలసీమలో ప్రజలతో పాటు, కోస్తా ఆంధ్రాలో ప్రజలు సైతం వారికి ఓట్లు వేయలేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వైసీపీ మూడు రాజధానులు తీసుకువస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పదవి దాహంతోనే చంద్రబాబు రగిలిపోతున్నాడని, కుప్పం ప్రజలు సైతం చంద్రబాబును తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

తిరుపతి : తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి దేవినేని ఉమా దర్శించుకున్నారు.. బుధవారం‌ ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో స్వామి వారి‌ సేవలో‌ పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని‌ ప్రార్ధించినట్లు చెప్పారు.. స్వామి వారు ఏపి రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి దేవినేని‌ ఉమా అన్నారు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget