అన్వేషించండి

Tirupati Temple Fined : టీటీడీకి ఆర్బీఐ షాక్, రూ.4.31 కోట్ల జరిమానా!

Tirupati Temple Fined: టీటీడీకి ఆర్బీఐ రూ.4.31 కోట్ల ఫైన్ విధించింది. విదేశాల నుంచి వచ్చిన కానుకల వివరాలు తెలపకపోవడం, ఎఫ్సీఆర్ఎ కాలపరిమితి ముగియడంతో కేంద్రం జరిమానా వేసింది.

Tirupati Temple Fined:  తిరుమల తిరుపతి ‌దేవస్థానానికి ఆర్బీఐ నాలుగు కోట్ల 31 లక్షల రూపాయలు ఫైన్ విధించింది. తిరుమల శ్రీవారికి వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే కొందరు హుండీలో నగదు రూపంలో కానుకలు సమర్పించి‌ మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క రూపాయి‌ నుంచి కోట్ల రూపాయలు నగదు, బంగారు, వెండి, వివిధ విదేశీ కరెన్సీ నోట్లను శ్రీవారి దర్శనంతరం హుండీలో సమర్పిస్తూ‌ ఉంటారు భక్తులు. ఎవరు ఎంత నగదు వేశారో అనే వివరాలు ఎవరికీ తెలియదు. స్థోమతకు తగ్గట్టుగా హుండీ కానుకలు సమర్పించే సౌలభ్యం ఉండడంతో కానుకలు వేసి వెళ్లిపోతుంటారు భక్తులు. ఇక ఈ హుండీలో సైతం ఎంతో మంది అజ్ఞాత భక్తులు, విదేశీ భక్తులు నగదును ట్రాన్సఫర్ చేస్తుంటారు. వీరి వివరాలు ఏమాత్రం టీటీడీకి అసలు తెలియజేయరు. ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలైన అమెరికా, ఇంగ్లండ్, అరబ్ దేశాలు, ఆస్ర్టేలియా, సింగపూర్, కెనడా, సింగపూర్, మలేషియా వంటి‌ దేశాల నుంచి కానుకలను ఈ‌హుండీ ద్వారా భక్తులు నగదును బదిలీ చేస్తుంటారు. ఇలా నగదును బదిలీ‌ చేసిన వారు చాలా వరకూ వివరాలు తెలిపేందులు‌ ఇష్టపడకుండా చాలా గోప్యంగా ఉంచుతారు. ఇలా వివరాలు తెలియజేయకుండా నగదును ఈహుండీ‌ ద్వారా పంపడం ద్వారా టీటీడీకి సుమారు 26 కోట్ల రూపాయలు అందాయి. 

ఈ-హుండీలో విదేశీకానుకలు 

ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి యూఎస్ డాలర్లు 11.50 కోట్లు, మలేషియా రింగిట్స్ రూ.5.93 కోట్లు, సింగపూర్ డాలర్లు రూ.4.06 కోట్లు ఉండగా, ఆ మొత్తాన్ని స్టేట్ బ్యాంకు టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడు సంవత్సరాలుగా కాలం పొడిగిస్తూ వచ్చింది. అయితే ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించింది. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ టీటీడీకి 2019లో 1.14 కోట్ల రూపాయలు అపరాధ రుసుము విధించింది. మళ్లీ ఈ ఏడాది మార్చి 5న కేంద్ర ఎఫ్.సి.ఆర్.ఎ విభాగం వార్షిక రిటర్న్‌ల్లో హుండీలో కానుకలు వేసిన వారి చిరునామాలు లేవని, టీటీడీ ఉన్నత అధికారులకు లేఖ రాస్తూ మళ్లీ  రూ. 3.19 కోట్ల జరిమానా విధించింది. ఇలా రెండు సార్లు అపరాధం విధించిన మొత్తం 4.31 కోట్ల రూపాయలు. అంతే కాకుండా టీటీడీకి రాసిన లేఖలో ఏపీ దేవదాయ శాఖ తప్పులను ఎత్తు చూపుతూ టీటీడీకి లేఖను‌ పంపింది. అయితే చాలా వరకూ ఈ హుండీ ద్వారా నగదును పంపిన భక్తుల వివరాలను టీటీడీ ఆర్బీఐకి‌ పంపలేకపోయింది. 

రూ.4.31 కోట్ల జరిమానా 

ఇదే అంశాన్ని‌ టీటీడీ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయగా, ఇదే విషయంపై న్యాయస్థానాల్లో కోసం ఫిటీషన్లు దాఖలు చేయగా, హుండీలో వేసిన కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానం కార్పస్‌లో భాగమేనని ఏపీసీహెచ్‌ఆర్ చట్టంలోని సెక్షన్ 111 పేర్కొన్నట్లు టీటీడీ తన వాదనలను వినిపించింది. అందుకే తమ రిటర్న్ లలో విదేశాల నుంచి వచ్చిన ఈ-హుండీ కానుకలను కూడా చూపించినట్టు తెలియపరిచింది.  అయితే ఎస్బీఐ టీటీడీకి చెల్లించకుండా పక్కన పెట్టిన 26 కోట్లకు వడ్డీ కూడా చెల్లించకపోవటంతో దానిపైన టీటీడీ కేంద్రానికి విన్నపాలు పంపినా  కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపింది.ఈ నగదు మొత్తంపైన కేంద్రం తెలిపిన విధంగా వివరాలు సేకరించి, టీటీడీ మళ్లీ గత మార్చి26న రిటర్నులు దాఖలు చేసింది. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా రూ. 3.19 కోట్ల జరిమానాను టీటీడీకి విధించింది.  ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ధార్మిక సంస్థకు కొంత మినహాయింపు‌ ఇవ్వాలంటూ టీటీడీ ఆర్బీఐని పలుమార్లు కోరింది. అయితే టీటీడీ విన్నపాన్ని ఆర్బీఐ తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగు కోట్ల ‌ముప్పై‌ ఒక్క లక్షల రూపాయల అపరాధ రుసుంను టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. అయితే 2018లో ముగిసిన ఎఫ్సీఆర్ఏ‌ లైసెన్స్ ను త్వరలోనే‌ కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget