అన్వేషించండి

Tirumala News : బ్రహ్మోత్సవాల తరహాలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, 4.5 లక్షల ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీ - వైవీ సుబ్బారెడ్డి

Tirumala News : శ్రీవారి వైకుంఠ ద్వార ఏకాదశి ఉత్సవాలను బ్రహ్మోత్సవాల తరహానీ నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Tirumala News : శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ఏటా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. సర్వ దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో 9 ప్రాంతాల్లో 92 కౌంటర్లల్లో టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరితగతిన భక్తులకు దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

నాలుగు లక్షల యాభై వేల టోకెన్లు 

జనవరి 2 నుంచి 11న వరకూ సంబంధించిన ఉచిత సర్వదర్శనం టోకెన్లను జనవరి ఒకటో తేదీన జారీ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పది రోజుల‌ టోకెన్లు పూర్తి అయ్యే వరకూ టోకెన్ల ‌జారీ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నామని వెల్లడించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకీన జెడ్పీ హైస్కూల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, రామానాయుడు పాఠశాల, శేషాద్రి నగర్ జెడ్పీ హైస్కూల్, గోవింద రాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్నామని తెలియజేశారు. సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. క్యూలైన్స్ లో ఉండే భక్తులకు, నీళ్లు, పాలు, టీ, కాఫీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక తిరుమలలోని స్థానికుల కోసం కౌస్తభం అతిథి గృహం వద్ద కౌంటర్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.  

గదుల అడ్వాన్స్డ్ బుకింగ్ రద్దు 

ఉచిత టోకెన్లు కలిగిన భక్తులు కృష్ణ తేజ అతిథి గృహం వద్ద రిపోర్టింగ్ చేయాలని, టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్దకు భక్తులు సులువుగా వెళ్ళేందుకు క్యూఆర్ కోడ్ సిస్టంను ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆన్లైన్ లో 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లకు సంబంధించి జనవరి 1, 2 నుంచి 11వ తేదీ వరకూ 2 లక్షల 5 వేల టోకెన్లు విడుదల చేశామన్నారు. రోజుకు రెండు వేల చొప్పున శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు జారీ చేశామని తెలిపారు.  టికెట్లు లభ్యతను ముందే తెలుసుకుని తిరుమల యాత్రపై భక్తులు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. భక్తులు తమకు నిర్దేశించిన సమయానికి తిరుమలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి వారి దర్శనం కలిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.  నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వ తేదీ వరకూ గదుల అడ్వాన్స్డ్ బుకింగ్ కేటాయింపు రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. తిరుమలకు వచ్చే ఒక్కో వీఐపీలకు రెండు గదులు మాత్రమే కేటాయిస్తున్నామన్నారు.  జనవరి 2, 3 తేదీల్లో వీఐపీ సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నామని తెలిపారు. 

మాస్కులు తప్పనిసరి 

వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై విహరిస్తారని, ద్వాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి 5:30 గంటల వరకూ స్వామి వారికి చక్రస్నానం నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అంతే కాకుండా వెనుకబడిన ప్రాంతాల నుంచి భక్తులను తీసుకుని వచ్చి పది రోజుల్లో ఉచితంగా పది వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని, డిసెంబర్ 31, జనవరి 1న ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. గోవిందా మాలలు ధరించిన భక్తులు కూడా టోకెన్లు తీసుకుని తిరుమలకు రావాలని, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మూడు వేల మంది శ్రీవారి సేవకులను వినియోగించుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలియజేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Lenin Movie : 'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Embed widget