అన్వేషించండి

Chittor News : పూతలపట్టులో ఫ్లెక్సీల చిచ్చు - పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనాలు !

పూతలపట్టులో వైసీపీ బంద్ సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. దెబ్బకు దెబ్బ తీస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు.

 

Chittor News :   చంద్రబాబు పర్యటన సందర్భంగా  పుంగనూరులో ఏర్పడిన ఉద్రిక్తతలతో చిత్తూరులో  వైసీపీ నేతలు బంద్ పాటించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పూతలపట్టు నియోజకవర్గంలోని మండల్లాలో టిడిపి, వైసీపి శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.  పూతలపట్టుల్లో వైసీపి శ్రేణులు బ్యానర్లు చించి వేసి చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు.. దీంతో ఆగ్రహించిన టిడిపి శ్రేణులు జగన్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి, చెప్పుల మాల వేసి దహనం చేశారు.

రౌడీ మూకల సాయంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ                      

ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం టిడిపి ఇంఛార్జ్ డాక్టర్ కే.మురళిమోహన్ వైసీపీ నాయకులపై మండిపడ్డారు.  చిత్తూరు జిల్లాలో విధ్వంసం సృష్టిస్తూ, జనాలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటుగా, టిడిపి సానుభూతిపరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. పూతలపట్టు నియోజకవర్గం లో టిడిపి సానుభూతిపరులపై వైసిపి నాయకులు చేస్తున్న దురాగతాలను ఎండగట్టేందుకే   టిడిపి శ్రేణులు రోడ్డు పైకి రావడం జరిగిందన్నారు.  అసలు చిత్తూరు జిల్లాలో వైసిపి నాయకులు ఇచ్చిన బంద్ కు అర్థమే లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.. టిడిపి నాయకులపై, పోలీసులపై దాడి చేసి తిరిగి టిడిపి నాయకుల పైనే వైసిపి నాయకులు కేసులు పెట్టారంటూ ఆయన ఆరోపించారు. 

ఎమ్మెల్యే  బాబుపై  టీడీపీ నేత మురళీ మోహన్ తీవ్ర విమర్శలు                                

పూతలపట్టు నియోజకవర్గంలో ఓ చిల్లర గాడు చిల్లర చేష్టలు చేశాడని, కావాలనే స్థానిక ఎమ్మెల్యే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని, ప్రశాంతంగా ఉన్న పూతలపట్టును అరాచకంగా మారుస్తున్నారని మండిపడ్డారు.  పూతలపట్టులో దెబ్బకు దెబ్బ భయపెట్టి అణిచివేస్తామంటే అది కేవలం వైసీపీ నాయకుల భ్రమే అని హెచ్చరించారు.. టిడిపి బ్యానర్లు చించి వేయడం‌ మగతనమా అని ఆయన ప్రశ్నించారు.. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు అసలు బంద్ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా తాగి ఊగి ఊరు పై పడి అరాచకాలు సృష్టిస్తున్నారని పూతలపట్టు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ మురళీమోహన్ ఆరోపించారు. 

టీడీపీ ఫ్లెక్సీలను చించేయడంతో  వివాదం ప్రారంభం                                                    

పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితుల తర్వాత చంద్రబాబునాయుడు పూతలపట్టులోనే బహిరంగసభ నిర్వహించారు. ఉదయమే వైసీపీ బంద్ సందర్భంగా ఈ పర్యటన కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయడంతో వివాదం ఏర్పడింది. వైసీపీ నాయకులు ఉదయమే రోడ్లపైకి వచ్చి దుకాణలను మూసి వేయించే ప్రయత్నం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dwaraka Tirumala Fake Tickets: ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Jeevan Reddy:రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
Simsa Mata Temple: జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
Embed widget