అన్వేషించండి

Fact Check : పవన్ ఢిల్లీ వెళ్లారా ? బీజేపీ హైకమాండ్ పిలిచిందా ? నిజం ఏమిటంటే ?

బీజేపీ హైకమాండ్ పిలుపు మేరకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ?

Fact Check :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆయన విజయవాడ నుంచి  హైదరాబాద్ మాత్రమే వెళ్లారని అంటున్నారు.  బీజేపీతో సరిగ్గా కలిసి పని చేయలేకపోతున్నామని .. అందుకే వ్యూహం మార్చుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించిన తరవాత బీజేపీలో అలజడి ప్రారంభమయింది. పలువురు నేతలు ఈ అంశాన్ని బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అందుకే వెంటనే బిజేపీ పెద్దలు పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వచ్చారని.. ఢిల్లీకి వస్తే మాట్లాడుకుందామని పిలిచారని చెప్పుకున్నారు. ప్రత్యేక విమానం కూడా పంపినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ అదంతా అబద్దమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

చంద్రబాబుతో భేటీ తర్వాత బీజేపీ హైకమాండ్ పవన్‌ను పిలిచినట్లుగా ప్రచారం

విశాఖలో జరిగిన ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. కానీ రాజ్ భవన్ నుంచి పవన్‌కు అపాయింట్మెంట్  విషయంలో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే పవన్ విజయవాడ పర్యటనలో ఈ సారి సంచలనాత్మక మార్పులు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడంతో.. కీలకమైన మార్పులు వచ్చాయి. ఈ పరిణామాలతో అనేక రకాలైన ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అందులో భాగంగానే.. పవన్ ను.. బీజేపీ హైకమాండ్ పిలిచిందని చెప్పుకున్నారని.. నిజంగా ఆయనకు బీజేపీ పెద్దల వైపు నుంచి ఎలాంటి పిలుపు రాలేదని చెబుతున్నారు. అలాగే పవన్ కూడా ఢిల్లీ వెళ్లలేదంటున్నారు. 

పవన్ దూరం కావడానికి సోము వీర్రాజే కారణమని విమర్శలు

మరో వైపు   జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తూండటంతో ఆ పార్టీలో అంతర్గత రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయంలో బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి నడిచేందుకు పవన్ కల్యాణ్  సిద్ధమై.. పొత్తు ప్రకటించినప్పటికీ ఆ పార్టీతో బీజేపీ కలిసి పని చేయలేకపోయింది. మొదట్లో సమన్వయకమిటీని ఏర్పాటు చేసుకుని ఆ మేరకు ఉమ్మడి పోరాటాలు చేయాలనుకున్నారు. కానీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం జరగలేదు. చివరికి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని సోము వీర్రాజు ప్రకటించారు. 

ఏపీ బీజేపీలో పవన్ దూరం కావడంపై ప్రకంపనలు

కానీ ఇటీవల జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన సమయంలో మాత్రం మాట మార్చారు. తమది జాతీయ పార్టీ అని ఇతర పార్టీల నేతలను ఎందుకు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కొంత మంది నేతలు ప్రకటించారు. దీంతో జనసేనతో గ్యాప్ పెరిగింది.ఈ పరిస్థితులన్నింటికీ కారణం సోము వీర్రాజేనని.. మరో సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ ఆరోపిస్తున్నారు.  ఈ కారణంగానే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. 

కన్నా బీజేపీకి గుడ్ బై చెబుతారా ? నెక్ట్స్ ఏ పార్టీలోకి ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget