అన్వేషించండి

AP Highcourt : అమరావతి రైతుల పిటిషన్లపై విచారణ పూర్తి .. తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు !

మూడు రాజధానుల బిల్లులపై పిటిషన్లను కొట్టి వేయాలని ప్రభుత్వం, విచారణ కొనసాగించాలని రైతులు హైకోర్టులో వాదనలు వినిపించారు. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులోవిచారణ ముగిసింది. సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అటు ప్రభుత్వం, ఇటు రైతుల వాదలను హైకోర్టు విన్నది. పిటిషన్లపై విచారణ కొనసాగించాలని రైతుల తరపు న్యాయవాదులు కోరారు. అయితే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నందున హైకోర్టులో దాఖలైన పిటిషన్లకు కాలం చెల్లిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం కొత్త చట్టం చేయకుండా ఆపే హక్కు కోర్టుకు లేదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు తేవాలని అసెంబ్లీలో చట్టం ఆమోదించింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని అమరావతికి భూములిచ్చిన రైతులు కోర్టుకెళ్లారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న విచారణ గత నవంబర్‌లో ప్రారంభమంది. అయితే విచారణ కీలక దశలో ఉండగానే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగానే నవంబర్‌లోనే ఉపసంహరణ బిల్లులు పెట్టి ఆమోదించేశారు. దీంతో మూడు రాజధానుల చట్టాలు రద్దయ్యాయి.

తాము మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నాం కాబట్టి రైతుల పిటిషన్లను కొట్టి వేయాలని ప్రభుత్వం హైకోర్టులో కోరింది. అయితే రైతులు మాత్రం  మళ్లీ మూడు రాజధానుల బిల్లు తెలుస్తామని ప్రభుత్వం చెబుతోందని.. విచారణ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. స్వయంగా ప్రభుత్వం కూడా మళ్లీ మూడు రాజధానుల బిల్లులు తెల్సాతమని హైకోర్టులో అఫిడవిట్ వేసింది. మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ..  మళ్లీ బిల్లులు తెస్తామని చెబుతున్నందున విచారణ కొనసాగించాల్సిందేనని రైతుల తరపు లాయర్లు హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు.  

హైకోర్టు రైతుల పిటిషన్లను కొట్టి వేస్తే కొత్తగా చట్టం తీసుకు రావాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మూడు రాజధానులు అనే చట్టాన్ని కొట్టి వేస్తారని తెలిసే ప్రభుత్వం మరోసారి చట్టం తేవడానికి  ఉపసంహరించుకుందని అందుకే విచారణ కొనసాగించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైతే రాజధాని వివాదం సద్దుమణిగింది.ఏపీ రాజదాని అమరావతేనని కేంద్రం కూడా చెప్పింది.  హైకోర్టు తీర్పును బట్టి తదుపరి పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఒక వేళ విచారణ కొనసాగిస్తే ప్రభుత్వానికి మరో చట్టం చేసే అవకాశం ఉండదు. రైతుల పిటిషన్లు కొట్టి వేస్తే మరోసారి మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP DesamSRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABPVirat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABPSRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Megha Akash: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ITR 2024: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
Embed widget