News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

AP Highcourt : అమరావతి రైతుల పిటిషన్లపై విచారణ పూర్తి .. తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు !

మూడు రాజధానుల బిల్లులపై పిటిషన్లను కొట్టి వేయాలని ప్రభుత్వం, విచారణ కొనసాగించాలని రైతులు హైకోర్టులో వాదనలు వినిపించారు. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులోవిచారణ ముగిసింది. సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అటు ప్రభుత్వం, ఇటు రైతుల వాదలను హైకోర్టు విన్నది. పిటిషన్లపై విచారణ కొనసాగించాలని రైతుల తరపు న్యాయవాదులు కోరారు. అయితే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నందున హైకోర్టులో దాఖలైన పిటిషన్లకు కాలం చెల్లిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం కొత్త చట్టం చేయకుండా ఆపే హక్కు కోర్టుకు లేదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు తేవాలని అసెంబ్లీలో చట్టం ఆమోదించింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని అమరావతికి భూములిచ్చిన రైతులు కోర్టుకెళ్లారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న విచారణ గత నవంబర్‌లో ప్రారంభమంది. అయితే విచారణ కీలక దశలో ఉండగానే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగానే నవంబర్‌లోనే ఉపసంహరణ బిల్లులు పెట్టి ఆమోదించేశారు. దీంతో మూడు రాజధానుల చట్టాలు రద్దయ్యాయి.

తాము మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నాం కాబట్టి రైతుల పిటిషన్లను కొట్టి వేయాలని ప్రభుత్వం హైకోర్టులో కోరింది. అయితే రైతులు మాత్రం  మళ్లీ మూడు రాజధానుల బిల్లు తెలుస్తామని ప్రభుత్వం చెబుతోందని.. విచారణ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. స్వయంగా ప్రభుత్వం కూడా మళ్లీ మూడు రాజధానుల బిల్లులు తెల్సాతమని హైకోర్టులో అఫిడవిట్ వేసింది. మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ..  మళ్లీ బిల్లులు తెస్తామని చెబుతున్నందున విచారణ కొనసాగించాల్సిందేనని రైతుల తరపు లాయర్లు హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు.  

హైకోర్టు రైతుల పిటిషన్లను కొట్టి వేస్తే కొత్తగా చట్టం తీసుకు రావాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మూడు రాజధానులు అనే చట్టాన్ని కొట్టి వేస్తారని తెలిసే ప్రభుత్వం మరోసారి చట్టం తేవడానికి  ఉపసంహరించుకుందని అందుకే విచారణ కొనసాగించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైతే రాజధాని వివాదం సద్దుమణిగింది.ఏపీ రాజదాని అమరావతేనని కేంద్రం కూడా చెప్పింది.  హైకోర్టు తీర్పును బట్టి తదుపరి పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఒక వేళ విచారణ కొనసాగిస్తే ప్రభుత్వానికి మరో చట్టం చేసే అవకాశం ఉండదు. రైతుల పిటిషన్లు కొట్టి వేస్తే మరోసారి మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Published at : 04 Feb 2022 02:26 PM (IST) Tags: ANDHRA PRADESH AP government ap high court three capitals Amravati Farmers Three Capitals Bill

ఇవి కూడా చూడండి

TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్‌ హాజరు

TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్‌ హాజరు

Petrol-Diesel Price 04 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 04 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Who is BRSLP Leader : ప్రతిపక్ష నేతగా కేటీఆర్‌కే చాన్స్ - కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావడం డౌటేనా !?

Who is BRSLP Leader :  ప్రతిపక్ష నేతగా కేటీఆర్‌కే చాన్స్ -  కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావడం డౌటేనా !?

Petrol-Diesel Price 03 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 03 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Top Headlines Today: నేడు తెలంగాణ సీఎం పేరు ఖరారు; జంపింక్‌కు రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: నేడు తెలంగాణ సీఎం పేరు ఖరారు; జంపింక్‌కు రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు - నేటి టాప్ న్యూస్

టాప్ స్టోరీస్

Women MLAs In Telangana: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కారు పంక్చర్‌- పదికి చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య

Women MLAs In Telangana: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కారు పంక్చర్‌- పదికి చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య

Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే! టచ్ లోకి మరో నలుగురు!

Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే! టచ్ లోకి మరో నలుగురు!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
×