అన్వేషించండి

AP News : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

ఒక్కో సచివాలయానికి రూ 20 లక్షలు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ డబ్బులతో ప్రజా సమస్యలను పరిష్కరించనున్నారు.


AP News :   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నిధుల సమస్య లేకుండా చూడాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం రూ. మూడు వేల కోట్ల ను కేటాయించింది. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో  భాగంగా ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు రకాల సమస్యలను  నేతల దృష్టికి తీసుకు వస్తున్నారు. గ్రామాల్లో రోడ్ల దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి  ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి పనులు జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. 

ప్రతి సచివాలయానికి రూ. ఇరవై లక్షలు

ప్రభుత్వానికి ఈ విషయం విజ్ఞాపనలు చేయడంతో ప్రతి సచివాలయానికి రూ. ఇరవై లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి  వరకూ రెండు సార్లు జరిగిన  గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు అదనంగా రూ. రెండు కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు సచివాలయం ప్రాతిపదికిన నిధులు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో ఉన్న మొత్తం 15,004 సచివాలయాలకు నిధుల మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షల మంజూరు చేయడం వల్ల నేతలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమ దృష్టికి వచ్చే సమస్యలను ఎక్కడిక్కకడ పరిష్కరించడానికి అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. 

ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలని నిర్ణయం 

అభివృద్ధి పనులకు నిధుల్లేవని ప్రజాప్రతినిధులు కొంత కాలంగా అసంతృప్తిలో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ అంతర్గత సమావేశాలతో పాటు పలు కార్యక్రమాల్లోనూ ఈ అసంతృప్తి బయటపడింది.  చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరి బిల్లులను చెల్లించడంతో పాటు సచివాలయానికి రూ. ఇరవై లక్షల నిధులు మంజూరు చేయడంతో  వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజలు చెప్పిన  సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 

సమస్యల పరిష్కారానికి డిమాండ్లు పెరగడంతో నిర్ణయం

ప్రస్తుతం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పార్టీ నేతలందరూ నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే అందులో  నిరసన వ్యక్తం కావడంతో ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ సమస్యను పరిష్కరించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ... గ్రామాల్లో.. పట్టణాల్లో ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందులో అందర్నీ కొత్త వారిని ఉద్యోగులుగా నియమించింది. ఇటీవలే వారికి ప్రొబేషన్ ఖరారు చేసి శాశ్వత ఉద్యోగులుగా తీసుకున్నారు. ఇప్పుడు ఆ సచివాలయాలు మరింత యాక్టివ్‌గా పని చేసేలా చూస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, అందుకే కొన్ని ఫిలిమ్స్ చేయలేదు - ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, అందుకే కొన్ని ఫిలిమ్స్ చేయలేదు - ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Embed widget