అన్వేషించండి

Achennaidu : అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసులో ట్విస్ట్ - చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోని ఏసీబీ కోర్టు !

ESI Case : ఈఎస్ఐలో అక్రమాలపై అచ్చెన్నాయుడుపై సీఐడీ నమోదు చేసిన కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది.

ESI Case refused to consider charge sheet against Achchennaidu  :  ఈఎస్‍ఐ కేసులో అచ్చెన్నాయుడుపై  చార్జిషీట్‍ను పరిగణలోకి తీసుకునేందుకు ఏపీసీ కోర్టు నిరాకరించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్‍ వేసేందుకు సీఐడీ అధికారులు వచ్చారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం చార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని  న్యాయమూర్తి  స్పష్టం చేశారు. చార్జిషీట్ పరిగణలోకి తీసుకోలేమని న్యాయమూర్తి తెలిపారు. అయితే  పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పిన ఏసీబీ తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి సంంధించిన కేసుల్లో తీర్పులు ఏమైనా ఉంటే చూపించాలని న్యాయనూర్తి ఆదేశించారు.  కేసు విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేశారు.                       

ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుుడు ఈఎస్ఐ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఆపరేషన్ చేయించుకుని ఉన్న సమయంలో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.  ఇంటి గోడలు దూకి మరీ తెల్లవారుజామున అచ్చెన్నను అరెస్టు చేశారు. ఒక్క నోటీసు ఇస్తే ఆయన వస్తారు. కానీ అదేమీ ఇవ్వకుండా అలా అరెస్టు చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. తర్వాత ఆయనను  రోడ్డు మార్గం ద్వారా ఆయనను గుంటూరు తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో కరోనా సమయంలోనూ  దాదాపుగా రెండున్నర నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.                               

2020 జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. ఈ స్కాంలో రూ.151 కోట్ల మొత్తం చేతులు మారాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఇందులో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా నిందితుడిగా ఉన్నట్లు అప్పటి ఏసీబీ జేడీ రవికుమార్‌ తెలిపారు. కానీ ఆయనను అదుపులోకి తీసుకోలేదు.              

2014 నుంచి 2019 మధ్య సాగిన ఈఎస్‌ఐ స్కాంలో మొత్తం రూ.151 కోట్ల మొత్తం అదనపు చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. అయితే మొత్తం ఈఎస్‌ఐకి కేటాయించిన రూ.970 కోట్ల బడ్జెట్‌లో ఈ మొత్తం ఎలా చేతులు మారిందనే అంశంపై తాజాగా ఏసీబీ మరిన్ని ఆధారాలు సంపాదించిందని అధికారులు ప్రకటించారు.  వీటికి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు.  అయితే మూడేళ్లు అయినా ఇంత వరకూ చార్జిషీటు దాఖలు చేయలేదు. ఇప్పుడు చార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ కోర్టు పరిగణనలోకి తీసుకునేందుకు అంగీకరించకపోవడం ఏసీబీ అధికారులకు ఇబ్బందికరంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget