అన్వేషించండి

Venkaiah Naidu On NTR : ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురైయ్యారు, వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

Venkaiah Naidu On NTR : సీనియర్ ఎన్టీఆర్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Venkaiah Naidu On NTR : ఎన్టీఆర్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అందరినీ నమ్మేవారని, అందుకే వెన్నుపోటుకు గురయ్యారన్నారు. శనివారం తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. రాజకీయాలకు కొత్త ఒరవడి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాల్లో ఒక కొత్త విప్లవం సృష్టించారు ఎన్టీఆర్ అని వెంకయ్య గుర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయాలలో ప్రధాన స్థానం కల్పించారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి అన్నారు. సిద్ధాంతాలు వేరైనా పద్ధతులు పాటించే వారంటే తనకు గౌరవమని వెంకయ్య నాయుడు అన్నారు. ఉచితాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. చేపలు పెట్టడం కాదు పట్టడం నేర్పాలన్నారు. నేటి సమాజంలో అశాంతి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ప్రస్తుత తరం కొనసాగించాలని కోరారు. ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేశానన్న ఆయన.. కానీ ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదన్నారు.  కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్‌ గమనించలేకపోయాని వెంకయ్య అన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ భోళా మనిషి అని, అందుకే వెన్నుపోటుకు గురయ్యారని తెలిపారు. ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారని వ్యాఖ్యానించారు. కొందరిని ఎన్టీఆర్ బాగా నమ్మారని, ఆగస్టు సంక్షోభంలో వాళ్లే ముందుండి నడిపారన్నారు.  

ఎన్టీఆర్ రాజకీయాల్లో సైలెంట్ విప్లవం తెచ్చారు

"జై ఆంధ్ర ఉద్యమం నుంచి తెనాలితో నాకు అనుబంధం ఉంది. తరచుగా తెనాలి వచ్చే వాడిని ఉద్యమంలో పాల్గొనేవాడిని. తెనాలిలో జనం, భోజనం రెండూ బాగుంటాయి. సమాజంలో అశాంతి పెరుగుతోంది. మనుషుల్లో అశాంతి పెరుగుతుంది. ఎంతో తెలియడంలేదు. జనం బిజీ అయిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు కూడా ఒక కారణం. శాంతిని పొందాలంటే ప్రకృతితో కలిసి జీవించాలి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషం. రామారావుకు పోటీ, సాటి ఎవరూ లేరని చెప్పవచ్చు. ఆయన చారిత్రక పురుషుడు. సినిమారంగంలో ఆయనకు ఎవరూ సాటిలేరు. రాజకీయరంగంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. రాజకీయాల్లో సైలెంట్ విప్లవాన్ని తీసుకొచ్చారు. బలహీన, బడుగు వర్గాలకు చేయూత నిచ్చారు. వెనుకబడిన, పేద వర్గాలకు పెద్దపీట వేశారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఈ పథకాలు రూపకల్పనలో ఆయన పాటు నేను ఉన్నాను. చెన్నైలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఎన్టీఆర్ చర్చించేవారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారికి అభ్యున్నతికి సహకరించారు. మహిళలను రాజకీయంగా ఒక మెట్టు ఎక్కించారు ఎన్టీఆర్. "

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget