Breaking News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 9న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
అన్ని పథకాల కింద ముఖ్యమంత్రి డబ్బు ఇస్తున్నారు కానీ, తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ తాగేవాడిని మనం మార్చలేమన్న ఆయన.. తన దురదృష్టం ఏమిటంటే తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉందని తెలిపాలు. అర కిలోమీటరు దూరంలో ఉన్న అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతున్నారన్నారు. మద్యం ఏరులై పారుతోంది అంటే తానేం చేయాలని ప్రశ్నించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు.
ట్యాక్స్ పేయర్స్కు గుడ్ న్యూస్
ట్యాక్స్ పేయర్స్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పన్ను చెల్లింపుదారులకు కీలక ప్రకటన చేసింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు గడువును పొడిగించింది. ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది.
హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దాదాపు 10 రోజులుగా ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఆఫీసు భవన శంకుస్థాపనకు వెళ్లిన సీఎం.. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.





















