Breaking News: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీడీపీ నిరసనలు... పలువురి అరెస్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ట్యోక్యో పారాలింపిక్స్లో భారత్కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణిపై భవీనాబెన్ విజయం సాధించింది. జాంగ్ మియావోపై 3-2 తేడాతో ఓడించింది. ఫైనల్కు చేరిన భవీనా భారత్కు పతకాన్ని ఖరారు చేసింది. పోలియో జయించిన భవీనాబెన్ పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచారు.
తెలంగాణలో 325 కోవిడ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 325 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,57,119కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 3,869కి చేరింది. నిన్న కోవిడ్ బాధితుల్లో 424 మంది కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో రికవరీల సంఖ్య 6,47,185కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 6,065 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం బులెటిన్ విడుదల చేసింది.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీడీపీ ధర్నా.. పలువురు అరెస్ట్
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు తెదేపా నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను గృహనిర్బంధం చేశారు. అనేకచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఆందోళనలను అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేశారు.





















