అన్వేషించండి

Breaking News 26 September: రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News 26 September: రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Background

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి చోటు ఉంటుందని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మంత్రివర్గాన్ని వంద శాతం మార్చాలనుకుంటున్నట్లు చెప్పారని తెలిపారు. పార్టీ విధానపరమైన నిర్ణయమైతే కచ్చితంగా మార్చాలని.. నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు బాలినేని వెల్లడించారు.

23:01 PM (IST)  •  26 Sep 2021

భారత్ బంద్‌కు మద్దతు తెలపడం లేదు.. తెలంగాణ జనసేన క్లారిటీ

భారత్ బంద్‌కు మద్దతివ్వడం లేదని జనసేన తెలంగాణ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శంకర్ గౌడ్, రాష్ట్ర నేత రామ్ తళ్లూరి సూచనల మేరకు జనసేన పార్టీ రేపు జరగనున్న భారత్ బంద్‌కు మద్దతు తెలపడం లేదు. పోడు రైతుల భూముల గురించి జనసేన పార్టీ పోరాటం చేస్తుందని గమనించాలని జనసేన నేతలు కోరారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా భారత్ బంద్‌కు మద్దతు లేదని పేర్కొన్నారు.

21:23 PM (IST)  •  26 Sep 2021

రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

భారత్ బంద్ కారణంగా రేపు పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి సురేశ్‌ ఆదేశాలు జారీ చేసింది. రేపటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరోరోజు స్కూల్ ఉంటుదని తెలిపింది. భారత్‌బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచనతో సెలవు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 

20:46 PM (IST)  •  26 Sep 2021

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియామకం

ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 30వ తేదీన ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్య సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ కు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  

20:15 PM (IST)  •  26 Sep 2021

తెలంగాణలో కొత్తగా 170 కోవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 170 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 34,200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,65,068కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో ఎవరూ కరోనాతో చనిపోలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజు వ్యవధిలో 259 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 6,56,544కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,612 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

20:15 PM (IST)  •  26 Sep 2021

భార్య, అత్తపై అల్లుడు హత్యాయత్నం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని ఆరోగ్యవరం ఐదోవ మైలు కాలనీలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరి తాలూకా దొన్నికోటలో ఉంటున్న ఆటో డ్రైవర్ రామరాజు మదనపల్లి మండలం ఆరోగ్యవరం(శానిటోరియం) ఐదు మైళ్ళ కాలనీలో ఉంటున్న అత్త ప్రసన్నకుమారి(50), భార్య వందన(32)లతో ఆదివారం గొడవపడ్డాడు. మాట మాట పెరిగి వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై రామరాజు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం వారిని తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Raj Tarun Comments: లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
MP Kalishetti Appalanaidu : ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Raj Tarun Comments: లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
MP Kalishetti Appalanaidu : ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
Ramya Krishnan: రాజమాత ఏంటిది? రమ్యకృష్ణ బోల్డ్ ఫొటోలు వైరల్ - ఇది కూడా AI మాయేనా? దారుణం!
రాజమాత ఏంటిది? రమ్యకృష్ణ బోల్డ్ ఫొటోలు వైరల్ - ఇది కూడా AI మాయేనా? దారుణం!
QR Code Current Bills: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి QR కోడ్, ఒక్క క్లిక్‌తో ఈజీగా బిల్ చెల్లించొచ్చు
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి QR కోడ్, ఒక్క క్లిక్‌తో ఈజీగా బిల్ చెల్లించొచ్చు
Bajaj Freedom CNG Launched: ఏకంగా 102 కిలోమీటర్ల మైలేజీతో - సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసిన బజాజ్!
ఏకంగా 102 కిలోమీటర్ల మైలేజీతో - సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసిన బజాజ్!
NEET PG 2024 Date: నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?
నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Embed widget