అన్వేషించండి

Breaking News Live: టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Key Events
telangana andhra pradesh breaking news live updates chandrababu live october 23 Breaking News Live: టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత
తాజా వార్తలు

Background


పోడు భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుంది. కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సీఎం భేటీ అయ్యారు. పోడు భూముల సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. అడవుల పరిరక్షణ, హరితహారంపైనా సమావేశంలో చర్చ జరుగుతుంది.

తెలంగాణలో పలు చోట్ల భూమి కంపించింది. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం 2:03 ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలోని రాంనగర్, గోసేన మండల్ కాలనీ, నస్పూర్‌లలో భూమి కంపించించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

వారం రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శనివారం) అతి స్వల్పంగా తగ్గాయి. భారత్ మార్కెట్లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,460గా కొనసాగుతోంది. మూడు రోజులుగా భారీగా పెరిగిన వెండి భారత్ మార్కెట్లో ఈ రోజులు రూ.400 తగ్గింది ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి.

అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఉపాధిహామీ పనులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.  విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల గ్రామ సచివాలయాల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఈ పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమాలు ఉంటాయని సీఎం అన్నారు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ పని మీద దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనకు సోమవారం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారయింది. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించి..   రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. అయితే చంద్రబాబు పర్యటన అంతటితో ఆగిపోయే అవకాశం లేదు. ప్రముఖ నేతలను కలుస్తారు. పాత రాజకీయ మిత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.

22:07 PM (IST)  •  23 Oct 2021

టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత

కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత కాట్రగడ్డ బాబు మృతిచెందారు. విజయవాడ లబ్బిపేటలోని ఆయన నివాసంలో శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. కాట్రగడ్డ బాబు మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.

20:25 PM (IST)  •  23 Oct 2021

న్యాయవ్యవస్థ లేకపోతే జగన్ నియంతలా మారేవారు : గోరంట్ల

పట్టాభి విడుదలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. న్యాయ వ్యవస్థ లేకపోతే జగన్ నియంతలా మారేవారని ఆరోపించారు. కోర్టులు  లేకపోతే  జగన్ లో  ఒక హిట్లర్ ని చూసేవాళ్లమన్నారు. అధికారపార్టీ ధర్నాలు చేసే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ లో  ఉందని విమర్శించారు.

 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget