అన్వేషించండి

West Rayalaseema MLC : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలో టీడీపీ విజయం-7543 ఓట్ల మెజార్టీ !

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది.

West Rayalaseema MLC :  పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు.  కడప - అనంతపురము - కర్నూలు నియోజకవర్గాల పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కువినియోగించుకున్నారు.    భూమిరెడ్డి రామగోపాల్ రెడ్ వైఎస్ఆర్‌సీపీ వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల తేడాతో  విజయం సాధించారు. దీంతో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించినట్లయింది. 

వైసీపీకి పెట్టని కోట లాంటి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పట్టభద్రులు కూడా తెలుగుదశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు.  గత ఎమ్మెల్సీఎన్నికల్లో ఈ స్థానం నుంచి మాజీ ఉద్యోగ సంఘం నేత వెన్నుపూస గోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి ఆయనకు బదులుగా ఆయన కుమారుడు  రవీంద్రారెడ్డికి అవకాశం కల్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఈ స్థానంలో విజయం సాధించింది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఓటమి పాలు కావడం ఆ పార్టీ నేతల్ని ఇబ్బంది పెడుతోంది. 

తొలి ప్రాధాన్య ఓట్లలో విజయానికి కావాల్సిన యాభై శాతం ఓట్లు ఎవరికీ రాలేదు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి  వెన్నుపూస రవీంద్రారెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.  ద్వితీయ ప్రాధాన్యం ఓట్లలో తెలుగుదశం పార్టీ అభ్యర్థిగా ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఎన్నికలకు ముందే  పీడీఎఫ్ నేతలు తమ ద్వితీయ ప్రాధాన్య ఓటు తెలుగుదశం పార్టీకి వేసేలా ఒప్పందం చేసుకున్నారు.  ఈ కారణంగా భారీగా ద్వితీయ ప్రాధాన్య ఓట్లు భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చాయి. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు పులివెందులలో కూడా  పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 

కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. కొన్ని ఓట్ల  బండిల్స్  టీడీపీకి వేశారని ఆరోపించారు. రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. పలుమార్లు కౌంటింగ్ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌంటింగ్ సెంటర్ నుంచి పదే పదే వైసీపీ అభ్యర్థి  రవీంద్రారెడ్డి బయటకు వెళ్లి పార్టీ నేతలతో మాట్లాడి వచ్చారు. అయితే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు చాలా ఎక్కువగా టీడీపీకి రావడం.. మెజార్టీ ఏడు వేలు దాటిపోవడంతో.. రీకౌంటింగ్ విషయంలోనూ అధికారులు  వైసీపీ డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదు. 

భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజవర్గం పులివెందులనే.  మొదటి నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుపై గురి పెట్టి శ్రమించారు. ఇప్పటికే టీడీపీ తపున బీటెక్ రవి పులివెందుల నుంచి స్థానిక సంస్థ కోటాల కింద ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి  టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నట్లయింది. పశ్చిమ సీమలోనూ వైసీపీ ఓడిపోవడం ఆ పార్టీకి నైతికంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.  కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కలిపి టీడీపీకి  గత ఎన్నికల్లో రెండు అంటే రెండు అసెంబ్లీ సీట్లు వచ్చాయి.  కడప, కర్నూలులో ఒక్కటీ రాలేదు. నాలుగేళ్లలోనే పరిస్థిత మారిపోవడం వైసీపీ వర్గాలకూ ఇబ్బందికరంగా మారింది.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP onion farmers: ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
OG Ticket Price Hike: తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
Telangana man shot dead in America:  ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
Advertisement

వీడియోలు

Martin Scorsese Living Legend of Hollywood | 60ఏళ్లు..26 సినిమాలు..హాలీవుడ్ సింగీతం.. స్కార్సెస్సీ | ABP Desam
Meta Ray-Ban Glasses Demo Failure | 43,500 ధరతో మెటా కొత్త స్మార్ట్ గ్లాస్సెస్
ఆసియా కప్ నుంచి ఆఫ్ఘన్ ఔట్.. సూపర్-4 లో ఇండియా షెడ్యుల్ ఫైనల్
ఆ వీడియో ఎలా బయటపెడతారు?.. పీసీబీకి ఐసీసీ సీరియస్ వార్నింగ్!
టీమ్ జెర్సీలోనూ పీసీబీ కక్కుర్తి.. అవినీతి బయటపెట్టిన పాక్ మాజీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP onion farmers: ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
OG Ticket Price Hike: తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
Telangana man shot dead in America:  ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
Sriya Reddy: షార్ట్‌లో శ్రియా రెడ్డి - Pawan Kalyan OG ప్రమోషన్స్ కోసమేనా!
షార్ట్‌లో శ్రియా రెడ్డి - Pawan Kalyan OG ప్రమోషన్స్ కోసమేనా!
YSRCP MLCs join TDP: టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్
టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్
Maoist Party : మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
Madanapalle News: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్
Embed widget