అన్వేషించండి

AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జగన్ చేసిన కుట్ర ఇదే - టీడీపీ సంచలన పోస్ట్ వైరల్

Andhra Pradesh Land Titling act: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంట పెడుతోన్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరో సంచలన విషయాన్ని వెల్లడించింది.

TDP Post on AP Land Titling Act: అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా మారింది. పింఛన్ వివాదం తరువాత గత కొన్ని రోజులనుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నారో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జగన్ చేసిన కుట్ర ఇదేనంటూ తెలుగు దేశం పార్టీ ఎక్స్ లో చేసిన ఓ పోస్టుతో స్పష్టత ఇచ్చింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలోనే జగన్ కుతంత్రం అమలు చేశారని టీడీపీ ఆరోపించింది. 

పాత గెజిట్‌లో ఏముంది, కొత్త గెజిట్ లో మార్పుపై టీడీపీ ట్వీట్ 
21 సెప్టెంబర్ 2022న విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెజిట్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా  "Any officer" అని ఉంది. అంటే ఓ ప్రభుత్వ అధికారి భూమి విషయంలో టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికా వ్యవహరించనున్నారు. కానీ 17 అక్టోబర్ 2023న ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెజిట్ నోటిఫికేషన్ లో గతంలో ఇచ్చిన "Any officer" అనే విషయాన్ని  "Any Person" గా మార్చారు. అంటే గత నోటిఫికేషన్ ప్రకారం ఓ ప్రభుత్వ అధికారి టీఆర్వో(TRO) గా వ్యవహరిస్తే, కొత్త గెజిట్ ప్రకారం ఏ వ్యక్తి అయినా టీఆర్వోగా పనిచేయవచ్చు. అంటే, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO)గా వైసీపీ నేతలని పెట్టి, మన భూములు, ఇళ్లు లాగేసుకునేందుకు భయంకరమైన కుట్ర పన్నారని టీడీపీ ఆరోపించింది. రాష్ట్ర ప్రజలు ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జగన్ రెడ్డి ఇలా మార్చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఫ్యాన్‌కు ఓటేయవద్దని కూటమి నేతల ప్రచారం.. 
అయిదేళ్లు అధికారం ఇస్తే జగన్ ఏపీని సర్వనాశనం చేశారని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఫ్యాన్ కు మళ్లీ ఓటేస్తే ఏపీలో ప్రజల భూముల్ని సీఎం జగన్ దోచుకుంటారని, వైసీపీ నేతలే భూమల్ని రిజిస్ట్రేషన్ చేస్తారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఏపీ ప్రభుత్వం ఆ చట్టంలో చేసిన మార్పుల కారణంగా వ్యతిరేకించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రజల భూముల్ని ఎవరైనా అధికారి రిజిస్ట్రేషన్ చేయాలి కానీ, జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త గెజిట్ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా టీఆర్వోగా వ్యవహరించి భూముల్ని సొంతం చేసుకునే వీలుందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రజల భూముల్ని దోచుకోవడం కాదు, హక్కు కల్పించడం: జగన్.. 
బ్రిటీష్ కాలంలో చేసిన చట్టాలే అమల్లో ఉన్నాయని, తాజాగా సర్వే చేసి భూముల అసలు హక్కుదారులకు భూమి ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలు చెబుతున్నారు. కూటమి నేతలు ప్రచారం చేసినట్లుగా ప్రజల భూముల్ని దోచుకోవడం జరగదని, వాస్తవ హక్కుదారుకు భూమి వచ్చేలా చేస్తామని పలు సభలలో సీఎం జగన్ ప్రస్తావించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget